— నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
District Collector Tripathi :ప్రజా దీవెన, నల్లగొండ: ప్రజలు వడదెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృ తంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నా రు.మంగళవారం తన చాంబర్లో వడదెబ్బపై తీసుకోవాల్సిన జాగ్ర త్తలపై ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆమె మాట్లా డుతూ తీవ్రమైన ఎండల కారణం గా ప్రజలు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉందని, అందువల్ల వడదెబ్బ గురికాకుండా తీసుకునే ముందస్తు జాగ్రత్తలపై పెద్ద ఎత్తున ప్రచారం కల్పించాలని తెలిపారు. వడదెబ్బకు గురి కాకుండా ఉం డేందుకు డాక్టర్ సలహాలను పాటిం చాలని, ఎండ సమయంలో బయ టికి వెళ్లకుండా ఉండాలని, తప్పని పరిస్థితి బయటికి వెళ్ళవలసి వస్తే తలపై టోపీ ధరించి వెళ్లాలని, సరిపోయినంతగా తాగునీరు తీసుకోవాలని ,ఓ ఆర్ ఎస్ పాకెట్లు, నిమ్మరసం, మజ్జిగ ,పండ్ల రసాల వంటివి తరచూ తీసుకుంటూ ఉండాలని తెలిపారు .
సన్నని, వదులుగా ఉండే, లేత రంగు దుస్తులు వాడటం, సూర్యరశ్మి తలపై తగలకుండా టోపీ ,టవల్ వంటివి ధరించడం చేయాలని చెప్పారు . ఎండలు అధికంగా ఉన్న సమయంలో వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలని, ఉదయం, సాయంత్రం సమయంలోనే బయటకు వెళ్లాలని తెలిపారు. చిన్నపిల్లలు, వయోవృద్ధులు ఎక్కువగా వడ దెబ్బకు గురయ్యే అవకాశం ఉందని, వారిని జాగ్రత్తగా చూసుకోవాలని ,ఉపాధి హామీ కూలీలు వడదెబ్బకు గురి కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, వారికి ఓ ఆర్ ఎస్ ద్రావణంతోపాటు, తాగునీరు, టెంట్ ఏర్పాటు చేయాలని గ్రామీణాభివృద్ధి అధికారులను ఆదేశించారు . అలాగే ఐసిడిఎస్ ,ఇతర శాఖలలో ఎండలో ఎక్కువగా పని చేసేవారు జాగ్రత్తలు తీసుకోవాలని ,వడదెబ్బకు గురైన వారు తక్షణమే దగ్గరలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం డాక్టర్ ను సంప్రదించాలని, సరైన సలహాలు తీసుకోవాలని సూచించారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పొట్ల శ్రీనివాస్ వడదెబ్బ కారణాలు, నివారణ చర్యలు, ముందు జాగ్రత్త చర్లపై వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వడదెబ్బపై రూపొందించిన కరపత్రాన్ని విడుదల చేశారు .
డి సి హెచ్ ఎస్ మాతృ నాయక్, డిప్యూటీ డిఎంహెచ్ఓ వేణుగోపాల్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారిని కృష్ణవేణి, వివిధ శాఖల అధికారులు, తదితరులు హాజరయ్యారు .