–నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
District Collector Tripathi :ప్రజా దీవెన, నల్లగొండ;సమాజంలో ఉన్నతమైన స్థానంలో ఉన్న వారిని ఆదర్శంగా తీసుకుని కష్టపడి చదివి సమాజానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి విద్యార్థులకు సూచించారు.శనివారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న అల్పసంఖ్యాక వర్గాల బాలికల రెసిడెన్షియల్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.పదవ తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థినులతో ముఖాముఖి మాట్లాడి వారి విషయ పరిజ్ఞానాన్ని పరీక్షించారు.డిస్కోర్స్ అంటే ఏంటి?అని ప్రశ్నించారు.ఇది గ్రామర్ లో ఒక భాగమని, డిస్కస్ అనే పదం ద్వారా డిస్కోర్స్ అనేది వచ్చిందని, అంశాల పై చర్చను డిస్కోర్స్ అంటారని తెలిపారు.
విద్యార్థినులు మంచి పరిజ్ఞానాన్ని సంపాదించేందుకు పుస్తకాలను ,వార్తా పత్రికలను బాగా చదవాలని ,ప్రత్యేకించి సంపాదకీయాలను చదవాలని ఆమె సూచించారు .అలాగే రోమిల్లా థాపర్, ఇందిరాగాంధీ వంటి మంచి ఉన్నతమైన వ్యక్తులు, ఆశయాలు కలిగిన వారిని ఆదర్శంగా తీసుకొని ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్యసాధనకు కృషి చేయాలని అన్నారు. బాగా చదవడం ద్వారా తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తీసుకురావాలని ,కుటుంబానికి చేయూతగా ఉండాలని అన్నారు.
ఈ సందర్భంగా ఆమె జర్నలిజం, క్రోమోజోమ్స్ , తదితర అంశాల పై విద్యార్థినిలకు అవగాహన కల్పిం చారు. అనంతరం కళాశాల వంట గదిని, డైనింగ్, పరిసరాలను పరిశీలించి వంటగది ఎప్పటిక ప్పుడు శుభ్రంగా ఉండేలా చూసు కోవాలని, అపరిశుభ్రత కారణంగా ఏ ఒక్క విద్యార్థిని ఆసు పత్రి పాలు కాకుండా చూడాలని, బర్ద్ ఫ్లూ కారణంగా చికెన్ వాడవ ద్దని ప్రిన్సిపల్ ను ఆదేశించారు. కాగా హాస్టల్ కు గ్యాస్ స్టవ్ లు కావాలని ప్రిన్సిపాల్ కోరగా అం దుకు జిల్లా కలెక్టర్ అంగీ కరిం చారు. ప్రిన్సిపల్ షాహిన్ షేక్, ఉపాధ్యాయినిలు ఉన్నారు.