Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Donation : దంపతుల ఔదార్యం,లక్ష్మీపల్లి పాఠ శాలకు కుర్చీలు బహుకరణ

Donation : ప్రజా దీవెన దేవరకద్ర: దేవరకద్ర మండలం లక్ష్మీ పల్లి ప్రాథమిక పాఠ శాలకు అదే గ్రామానికి చెందిన దంపతులు వల్లెమోని హరిత, వల్లె మోని రమేష్ కుమార్ లు కుర్చీలు బహుకరించి తమ ఔదార్యం,ఉ దా రతలను చాటుకున్నారు. విద్యా బుద్దులు నేర్చుకున్న పాఠశాలకు కుర్చీలు అవసరం ఉందనే విష యాన్ని తెలుసుకున్న వల్లెమోని రమేష్ కుమార్ స్వచ్చందంగా ముందుకు వచ్చి తన తల్లి దివం గత వల్లె మోని బాలకిష్ఠమ్మ జ్ఞాప కార్థం 5 కుర్చీలు, ఒక స్టూల్ ను పాఠశాలకు బహుకరించారు. ఈ సందర్భంగా దాత రమేష్ కుమార్ మాట్లాడుతూ పాఠశాల ప్రగతికి భవిష్యత్తులో తన వంతు సహకా రం మరింత అందిస్తానని అన్నా రు.

 

పాఠశాల ఉపాధ్యాయులు లయన్ అశ్విని చంద్రశేఖర్ మాట్లా డుతూ ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక సదుపాయాలు కల్పిం చేం దుకు దాతలు అందిస్తున్న సహ కారం గొప్పదని అన్నారు. సమా జంలోని ప్రతి ఒక్కరూ పాఠశాలల పురోభివృద్ధికి చేయూత నివ్వాలని కోరారు. కాగా పాఠశాలకు కుర్చీలు బహుకరించిన హరిత,రమేష్ దం పతులను పాఠశాల ఉపాద్యాయు లు, విద్యార్థులు ఘనంగా సత్కరిం చి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కా ర్యక్రమంలో పాఠశాల ప్రధానోపా ధ్యాయురాలు, ఎస్.కల్పన, ఉపా ధ్యాయులు అశ్విని చంద్ర శేఖర్, విజయ లక్ష్మీ , నాగేశ్వర్ రెడ్డి, విద్యా వాలింటర్ మాడమోని వెంక ట్రాములు,విద్యార్థులు తదితరు లు పాల్గొన్నారు.