Gadwal SP : ప్రజా దీవెన, జోగులాంబ గద్వాల: యువత, విద్యార్థులు అక్రమ బె ట్టింగ్ యాప్స్,గేమ్ యాప్లకి అల వాటు పడి అప్పులపాలై ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని, అక్ర మ బెట్టింగ్ యాప్స్ లలో బెట్టింగ్ కి పాల్పడిన ,ఆన్లైన్ గేమింగ్ యాప్ లలో గేమ్స్ ఆడిన, ప్రోత్సాహించిన కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు హెచ్చరించారు.
జిల్లా లో యువత ఆన్లైన్ బెట్టింగ్ కు వెళ్లకుండా ఉండాలనీ, అందు కు యువత తీసుకోవాల్సిన జాగ్రత్త లపై జిల్లా ఎస్పీ శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
నేటి సమాజంలో సాంకేతిక పరి జ్ఞానం, సోషల్ మీడియా ప్రభావం బాగా పెరిగింది, ప్రతిఒక్కరికీ ఇంట ర్నెట్ అందుబాటులో ఉండడం, కొ న్ని సందర్భాల్లో అవగాహన లోపం వల్ల చాలామంది ప్రజలు, యువత ఇబ్బందులు ఎదుర్కొంటు న్నార న్నారు. మోసపూరిత ప్రకటనలు, సందేశాలు చూసి మోసపోతున్నా రు, ఆన్లైన్ బెట్టింగులు పెట్టడం, ఆన్లైన్ లో పెయింగ్ గేమ్స్ ఆడటం, గుర్తింపు లేని అంతర్జాల సంస్థల్లో డబ్బు పెట్టుబడుల వల్ల చాలామం ది ఆర్థిక నష్టాల బారిన పడుతు న్నారని తద్వారా జీవితాన్ని నాశ నం చేసుకుంటున్నారని , అవగా హన లేక అత్యాశకు పోయి ఆన్లైన్ నందు పెట్టుబడులు పెట్టడం వల్ల కూడా ప్రజలు మోసాలబారిన పడుతున్నారు, బెట్టింగ్ యాప్ లు చాలా ప్రమాదకరమైనవి, వీటిల్లో ఒక్కసారి చిక్కుకుంటే బయటకు రావడం ఇబ్బంది అవుతుంది, యా ప్ నిర్వాహకుల నుండి బెదిరింపు లు వస్తాయని అన్నారు.
తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చన్న భ్రమ లో యు వత, విద్యార్థులు అక్రమ బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ కి బాని సలుగా మరి అప్పులపాలై ప్రాణాల కు మీదకు తెచ్చుకొని విలువైన ప్రాణాలు పోగొట్టుకుంటు న్నరని, ముఖ్యంగా సోషల్ మీడి యా ఇన్ఫ్లు న్సర్లు సోషల్ మీడి యాలో వీటిని ప్రోత్సహించడం వల్ల యువతలో దీని వ్యసనం పెరుగుతోందని వీటి కట్టడికి జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా ఏర్పా టు చేయడం జరు గుతుందన్నా రు.
అక్రమ బెట్టింగ్ యాప్స్ లలో బెట్టిం గ్ కి పాల్పడిన ,ఆన్లైన్ గేమింగ్ యాప్ లలో గేమ్స్ ఆడిన, ప్రోత్సా హించిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్ లు ఆయా యాప్ నిర్వహకుల సూచనల మేరకే ఆప రేట్ చేయబడుతాయని, ఆన్లైన్ గేమింగ్ మాటున ప్రమాదకర మాల్ ప్రాక్టీస్ ఉంటుంది ఫెక్ లింక్స్ తో వ్యక్తి గత సమాచారం, అకౌంట్ వి వరాలు తెలుసుకొనే అవకాశం ఉ న్నందున గేమింగ్ యాప్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఈఅక్రమ బెట్టింగ్ యాప్లను సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసే ఎవరిపైనా ఉపేక్షించేది లేదని ప్రజలు,యువత అప్రమత్తంగా ఉండి, ఇటువంటి కార్యకలాపాలపై వెంటనే డయల్ 100 కు, స్థానిక పోలీస్ వారికి సమాచారం అందిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
జిల్లాలో సోషల్ మీడియా ఇన్ఫ్లు ఎన్సర్లు బాధ్యతాయుతంగా వ్యవ హరించాలని, అక్రమ బెట్టింగ్ యా ప్లకు సంబంధించి ప్రచారాన్ని చే యవద్దని, ఆన్లైన్ బెట్టింగ్ , ఆన్ లైన్ గేమ్స్ వలన కలిగే పరిణామా ల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు.