Get Together : ప్రజా దీవెన శాలిగౌరారం : శాలిగౌరారం విజ్ఞాన జ్యోతి హై స్కూల్ లో చదువుకున్న 2006- 2007 ఎస్ ఎస్ సీ బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆదివారం శాలిగౌరారం లోని జి బి ఎం ఫంక్షన్ హాల్ లో పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. 60 మంది విద్యార్థిని విద్యార్థులు 18 సంవత్సరాల తర్వాత అందరు కలుసుకోవడం వారి మధుర జ్ఞాపకాలు స్మరించుకొని ఒకరినొకరు ఆప్యాతగా పలకరించుకున్నారు.ఆనాడు పాఠశాల లో భోదించిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానం చేసి వారి ఆశీస్సులు తీసుకున్నారు.
అనంతరం ఉపాధ్యాయులకు మెమోoటోస్ అందజేశారు.. వారి గత అనుభవాలు ఇప్పుడు ఉన్న స్టేటస్ ను తెలుపుకుంటూ సంతోష వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అప్పటి హెచ్ ఎం, కరస్పాండెంట్ బుడిగె శ్రీనివాస్, ఉపాధ్యాయులు కొయ్యడ శివశంకర్,పడాల అంతయ్య,కోడవటికంటి సుభ్రమణ్య శర్మ,రావుల వీరయ్య,బెల్లంకొండ స్వామి, చెవుగాని సత్యనారాయణ, మద్ది శశిధర్ రెడ్డి, ఖాజా, అరుణ, రజిత, లక్ష్మి, రేఖ, ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.