Indiramma’s houses : ప్రజా దీవెన, హైదరాబాద్: కేంద్రం లోని ఎన్డీఏ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల మంజూరు విష యంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఉన్నపలంగా ఇందిరమ్మ ఇళ్లకు కేంద్రం బ్రేకుల వేసింది. తాము రూపొందించిన యాప్ ద్వారా సర్వే నిర్వహంచ కపోవడంతో రాష్ట్రం పంపిన 23 లక్షల లబ్దిదారులను తాము గుర్తిం చబోమంటూ సమాచారం పంపిం ది. కేంద్రం రూపొందించిన గైడ్ లై న్స్ ప్రకారం తిరిగి సర్వే చేసి పంపా లని సదరు ప్రత్యుత్తరంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది.
తెలంగాణ రాష్ట్రంలో పేదల ఇళ్లకు సంబంధించిన ఇందిరమ్మ పథకం అమలు విషయంలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చిక్కుముడి పడింది. గ్రామీణ ప్రాంత ఇళ్లకోసం అందిన సుమారు 30 లక్షల దరఖా స్తులపై సర్వే చేసిన రాష్ట్ర ప్రభు త్వం 23 లక్షల దరఖాస్తుదారులను అర్హులుగా గుర్తించి, జాబితా సిద్ధం చేసింది. ఆ దరఖాస్తులను కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన స ర్వేను తాము పరిగణనలోకి తీసు కోబోమని, తాము రూపొందించిన మొబైల్ అప్లికేషన్ ఆధారంగా మళ్లీ సర్వే చేసి వివరాలు అందజేయాల ని కేంద్రం విష్పష్టంగా తెలియజే సిం ది. దీనితో కంగుతినడం రాష్ట్ర ప్ర భుత్వం వంతు అయింది. అన్ని లక్షల దరఖాస్తులకు సంబంధించి కేంద్ర యాప్తో మళ్లీ సర్వే చేయ టం ఇప్పటికిప్పుడు అయ్యే పని కాదు. మరోవైపు ప్రభుత్వం ఇప్ప టికే ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.
కేంద్రం మెలికతో గందరగో ళం… కేంద్ర ప్రభు త్వం నుంచి నిధులు అందితే లబ్ధి దారులకు మొదటి విడత సొమ్ము అందజేసేం దుకు సిద్ధమైంది. అలాంటిది కేం ద్రం పెట్టిన మెలికతో గందరగోళం మొదలైంది.దాదాపు పుష్కర కా లం తర్వాత రాష్ట్రంలో మళ్లీ ఇంది రమ్మ పేరుతో పేదల ఇళ్ల ని ర్మాణా నికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హ యాంలో తెలంగాణ పరిధిలో దా దాపు 19 లక్షల ఇందిరమ్మ ఇళ్ల ను నిర్మించారు. ఇప్పుడు వచ్చే నా లు గేళ్లలో దాదాపు 20 లక్షల ఇళ్లను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ల క్ష్యంగా పెట్టుకుంది. దీనిలో వీలై నన్ని నిధులను కేంద్రం నుంచి పొం దాలని నిర్ణయించింది. ప్రధాన మం త్రి ఆవాస్ యోజన పథకం కింద 20 లక్షల ఇళ్లను మంజూరు చేయా లని కోరింది. ఎన్ని ఇళ్లు మంజూరు చేస్తుందనేది కేంద్రం ఇప్పటివరకు స్పష్టం చేయలేదు. పైగా ఒక్క ఇల్లు కూడా అనర్హుల చేతికి అందకూడ దని, కేంద్రం ఖరారు చేసిన నిబంధ నలను కచ్చితంగా అమలు చేయా లని, అనర్హులకు ఇళ్లు మంజూరు చేసినట్టు తేలితే నిధులు ఇవ్వబో మని షరతులు పెట్టింది. దీనికి అంగీ కరించిన రాష్ట్ర ప్రభుత్వం అక్రమాలకు తావు లేకుండా చూడా లని అధికారులను అప్రమత్తం చే సింది. కానీ సర్వే విషయంలోనే ఇప్పుడు చిక్కు వచ్చి పడింది.
యాప్తో సర్వే పునః ప్రారం భం… ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల కోసం ప్రభుత్వానికి దాదాపు 30 లక్షల దరఖాస్తులు అందాయి. కేం ద్ర ప్రభుత్వం ఖరారు చేసిన పరిశీ లనాంశాల ఆధారంగా అధికార యంత్రాంగం ఇటీవలే దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి 23 లక్షల మం దిని అర్హులుగా గుర్తించింది. ఇందు లో 19.50 లక్షల మంది సొంత జా గా ఉన్నవారుకాగా మూడున్నర లక్ష ల మంది సొంత భూమి లేనివా రు. రాష్ట్రం తాజాగా ఈ వివరా ల ను కేంద్రానికి అందజేసి నిధులు మంజూరు చేయాలని కోరింది. అయితే తాము రూపొందించిన మొబైల్ అప్లికేషన్ ఆధారంగా ఈ సర్వే జరగనందున పరిగణనలోకి తీసుకోబోమని, ఆ మొబైల్ యాప్ ద్వారా మళ్లీ సర్వే చేసి వివరాల జాబితా సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్రం ప్రామాణికంగా నిర్ధారించిన అంశా లనే పరిగణనలోకి తీసుకుని సర్వే చేశామని, వివరాల్లో ఎలాంటి తేడా ఉండదని.. దీన్ని గుర్తించి ఆ జాబి తాను కేంద్ర ప్రభుత్వ యాప్తో అనుసంధానించాలని రాష్ట్ర ప్రభు త్వం కోరింది. అయినా కేంద్రం ససే మిరా అంటున్నట్టు తెలిసింది.
దరఖాస్తుల్లో బ్యాంకు ఖాతా, ద్విచ క్ర వాహనాలు, పన్ను చెల్లింపు వం టి వివరాలేవీ లేవని, అవి లేకుండా జాబితా తీసుకోబోమని స్పష్టం చే సినట్టు సమాచారం. ఇవి పెద్దగా తే డా చూపే అంశాలు కాదని, ఇళ్లను మంజూరు చేసేనాటికి ఆ వివరా లను కూడా అప్లోడ్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ కోరినట్టు తెలిసింది. కేంద్రం సానుకూలంగా స్పందించి నిధులు ఇస్తుందని రా ష్ట్ర ప్రభుత్వం ఆశాభావంతో ఉ న్న కేంద్రం నుంచి ఇంకా ఎలాంటి స్ప ష్టత రాలేదు.
ఇక్కట్లలో ఇందిరమ్మ ఇళ్ల పథ కం.. పట్టణ ప్రాంత ఇళ్లకు కేంద్రం యూనిట్ కాస్ట్ను రూ.లక్షన్నరగా ఖరారు చేసింది. దీనితో వీలైనన్ని ఎక్కువ ఇళ్లను పట్టణ ప్రాంత ఖా తా కింద పొందాలని రాష్ట్ర ప్రభు త్వం ప్రయత్నిస్తోంది. అయితే దేశ వ్యాప్తంగా మంజూరు చేసే పట్టణ ప్రాంత ఇళ్లలో 4 శాతాన్ని తెలంగా ణకు ఇస్తామని కేంద్రం స్పష్టం చేసిం ది. ఇది చాలా తక్కువని, సంఖ్య మరింత పెంచాలని కేంద్రాన్ని రా ష్ట్రం కోరింది. కానీ స్పష్టత రావాల్సి ఉంది. ఇక గ్రామీణ ప్రాంత ఇళ్లకు సంబంధించి యూనిట్ కాస్ట్ రూ. 73 వేలుగా ఉంది. ఈ నిధులన్నా పొందుదామంటే కేంద్రం పెట్టిన మె లిక కలవరపెడుతోంది. రాష్ట్ర ప్రభు త్వం ఒక్కో ఇంటికి రూ.5 లక్షల ఆర్థిక సాయం చేయాలని నిర్ణయిం చింది. కేంద్రం నుంచి సాయం అంద ని పక్షంలో మొత్తం నిధులను రాష్ట్ర మే భరించాల్సి వస్తుంది. దీంతో అది పెద్ద భారంగా మారుతుందని అధికార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.