KCR : ప్రజా దీవెన, ఎర్రవల్లి: పదేండ్ల బిఆ ర్ఎస్ ప్రగతి పాలనలో జలాలతో అలుగెల్లిన గోదావరి కాళేశ్వరం ప్రా జెక్టులు, కాంగ్రెస్ పాలన తెచ్చిన కరువుతో చెరువులు కుంటలు అడుగంటి ఎడారిగా మారడం పట్ల బి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ఆవే దన వ్యక్తంచేశారు. “తలాపున పా రుతుంది గోదారి నీ చేను నీ చెలుక ఎడారి”..అని నాటి ఉమ్మడి రాష్ట్రం లో తెలంగాణ నీటి కష్టాలను వివరి స్తూ, నాటి కవి సదాశివుడు రాసిన పాటను తిరిగి గుర్తు కుచేసుకునే పరిస్థితులు తలెత్తడం శోచనీయం అన్నారు.ఎండిన గోదావరి తల్లి క న్నీటి గోసను కాళేశ్వరం నీళ్ళందక పంటలు ఎండిన రైతన్నల గుండె కోతను సభ్య సమాజానికి తెలిపేం దుకు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అధ్వర్యంలో రా మగుండం నుంచి ఎర్రవల్లి దాకా 2 00 మందితో కూడిన 180 కిలోమీ టర్ల పాదయాత్ర వారం రోజుల పా టు సాగి శనివారం ముగిసింది. ఈ ముగింపు సభ బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి అధ్యక్షతన ఎర్రవల్లిలో జరిగింది.
ఈ సందర్భంగా బి ఆర్ ఎస్ అధినే త కేసీఆర్ మాట్లాడుతూ పోయిన సంవత్సరం ఇదే రోజు నిండు కుం డల్లాంటి కాళేశ్వరం ప్రాజెక్టులు నేడు ఎందుకు ఎండిపోయినాయో ఇందుకు కారణం ఎవరు అనే విష యాన్ని సభ్యాసమాజానికి తెలి యజేసేందుకు కోరుకంటి చందర్ అధ్వర్యంలో పాదయాత్ర చేయడం అభినందనీయమన్నారు. పాద యాత్రలో పాల్గొన్నప్రతీ ఒక్కరినీ కేసీఆర్ అభినందించారు. ఈ స మావేశంలో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగం యావత్తు ఆయన మాటల్లోనే.. తెలంగాణ ను కొట్లాడి సాధించు కున్నాం. ఎంతో జాగ్రత్తగా నిలబెట్టు కున్నం. ప్రజలు ఏమను కున్నారో ఏందో కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకు న్నరు. అదీ వాళ్లిష్టం. కానీ దాని ఫలితం లోకం చూస్తున్నది.
” ఇన్నాళ్ళు లేని నీటి గోస ఇప్పు డెందుకు వచ్చినట్టు, తెలంగాణ కు నీళ్లు ఇవ్వాలనే పాలనా ప్రాధాన్య తను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చే యడం వల్లే తెలంగాణకు సాగు నీరు తాగునీరు సమస్య వచ్చింది.”
” సమైక్య పాలకులు తెలంగాణ విషయంలో మొదటి నుంచీ నీటి సమస్యను ఆర్ధిక సమస్యగా చూ డడం ఒక అవలక్షణంగా మార్చు కున్నారు. గల్ఫ్ లాంటి ఎడారి దేశా ల్లో నీళ్లుండవు. అక్కడి ప్రభుత్వా లు సముద్ర జలాలనుంచి ఉప్పును వేరుచేసి నీటిని శుద్ధి చేసి మంచినీ రుగా వాడుకుంటారు. మద్రాస్ లో కూడా నీటి కొరతను అధిగమించేం దుకు అటువంటి కార్యాచరణను చేపట్టారు. భౌగోళిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రజల శ్రేయస్సును పరిగణలోకి తీసుకొని ప్రభుత్వాలు పనిచేయవలసి ఉం టుంది. అంతేతప్ప వాటిని ఖర్చు కు లింకు పెట్టి ఆలోచన చేయడం తప్పు. తెలంగాణకు సాగునీరు తాగునీరు అవసరం. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చుకు వెనకాడకుండా ప్రజలకు తాగునీరు వ్యవసాయానికి సాగు నీరు అందించాల్సిందే.
” తెలంగాణ రాగానే నాటి బిఆర్ఎ స్ ప్రభుత్వం, వ్యవసాయ స్థిరీకరణ కోసం దృష్టి సారించి పటిష్టమైన కా ర్యాచరణను అమలు చేసింది. రై తాంగ వ్యవసాయ అభివృద్ధి పాల నా ప్రాధాన్యతాంశంగా నాటి బీఆర్ ఎస్ ప్రభుత్వం ఎంచుకుంది.
అందులో భాగంగా ప్రాజెక్టుల ద్వా రా సాగునీరు అందివ్వడం. వ్యవ సాయానికి నాణ్యమైన విద్యుత్ను ఉచితంగా అందించడం. పంట పె ట్టుబడి సాయం చేయడం. పండిన ధాన్యాన్ని గిట్టుబాటు ధరకు ప్రభు త్వమే కొనుగోలు చేయడం అనే అంశాలను ప్రాధాన్యతగా తీసుకొని ఎన్ని కష్టాలొచ్చినా నాటి బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసింది. అందు చేతనే పదేళ్లపాటు రాష్ట్ర రైతాంగం ప్రజలు ఎటువంటి బాధలు లేకుం డా జీవించారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం వీటిని అందించడానికి ఖర్చు అవుతుందని వెనకాడుతు న్నది. ఇది సరికాదు.
ఎప్పుడైనా ప్రభుత్వాలే రైతుల దగ్గర భూమి శిస్తులు వసూలు చేసిన సందర్భాలున్నాయి కానీ ఉల్టా ప్రభుత్వమే రైతుకు భరోసా కల్పించే విధంగా పంట పెట్టుబడి అందించిన పరిస్థితి ఈ దేశంలో ఉన్నదా, రైతు సంక్షేమం దిశగా కేవలం బిఆర్ఎస్ ప్రభుత్వం ఆలో చన ఫలితమే.ఈ పరిస్థితులను తె లంగాణ సమాజం ఇప్పటికైనా అ ర్థం చేసుకోవాలి. మనం ఇచ్చిన క రెంటు ఎటు పోయింది ? మనం ఇచ్చిన మిషన్ భగీరథ తాగునీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ? ఎండాకాలం లో కూడా మత్తడి దునికిన చెరువులు ఇప్పుడు ఎం దుకు నీరు లేక ఎండిపోతున్నా యో.. ప్రజలు అర్థం చేసుకోవాలి.
పల్లెల నుంచి హైదరాబాదు వంటి పట్టణాలకు బతకడానికి వచ్చిన పేదలకు నాటి మన ప్రభుత్వం అండగా నిలిచింది. కానీ ఇప్పుడు న్న ప్రభుత్వము వాళ్ల ఇండ్లను కూ ల్చివేస్తున్నది. గోరేటి వెంకన్న లాం టి కవులు రాసిన, గల్లి చిన్నది గరీ బోళ్ల కథ పెద్దది వంటి పాటల స్ఫూ ర్తితో, పేదలకు ఇండ్ల నిర్మాణం చేప ట్టినం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పేద ల ఇండ్లను హైడ్రా పేరుతో కూల్చే స్తుంటే, కేసీఆర్ అన్నా ఎక్కడున్నా వు రావే…రావే…అని ఆవేదన వ్య క్తం చేస్తున్నారు.. కానీ నన్ను వోడ గొట్టి ఇంట్ల కూర్చోబెట్టిండ్రు కదా.. నేను ఎక్కడికి రావాలె? కత్తి ఒక నికి ఇచ్చి యుద్ధం ఒకరిని చేయ మంటే ఎట్లా అయితది.
” కేసీఆర్ ప్రభుత్వంలో పదేళ్లపాటు ప్రశాంతంగా బతికినాము అని తె లంగాణ సమాజం భావిస్తున్నది. ఇప్పుడు తిరిగి మళ్లీ పాదయాత్ర లు, ధర్నాలు, కొట్లాటలు మొదలైన యి. తెలంగాణకు ఎప్పుడు ఇగ ఇదే లొల్లా..? ప్రశాంతంగా బతుకొ ద్దా.
ఇకనైనా తెలివిగా ఆలోచన చే యాలి… పాదయాత్రలు కాదు మన మనసుతో యాత్రలు చేయా లి బుర్రతో ఆలోచనలు చేయాలి. ప్రశాంతంగా ఉన్న తెలంగాణను పా డు చేసుకునే ఆలోచనలు కాకుం డా మన భవిష్యత్తు తరాలను మ రింతగా బాగు చేసుకునే దిశగా ఆలోచన చేయాలి.తెలంగాణకు ప్రధాన శత్రువే కాంగ్రెస్ అని కెసిఆర్ పునరుద్ఘాటించారు.తెలంగాణ సా యుధ పోరాట కాలం నుంచీ నేటి దాకా పలు సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను కేసీఆర్ సమావేశంలో వివరించారు. నెహ్రూ సహా ఇందిరాగాంధీ, సోనియాగాం ధీ నుంచి నేటిదాకా కాంగ్రెస్ తెలం గాణకు జరిగిన ద్రోహలను కెసిఆర్ వివరించారు.
తెలంగాణను ఆంధ్రలో కలపడం నుంచి, 19 69 లో వందలాది మం ది బిడ్డలను పొట్టన పెట్టుకోవడం నుంచి, నీళ్లు నిధులు , నియామకా లు విషయంలో తెలంగాణకు దశా బ్దాల కాలంగా జరిగిన అన్యా యాలను కేసీఆర్ వివరించారు.
తెలంగాణకు జరుగుతున్న అన్యా యాలను మొదటినుంచీ కనీస స్థాయిలో ప్రతిఘటించలేని నాటి నాయకత్వం ఎంతో నష్టం చేసింద నే ఆవేదన, వాళ్ళ తెలివి తక్కువ తనం చూసి, ఉద్యమ కాలంలో నేను వాళ్ళను దద్దమ్మలు సన్నా సులు అని తెలంగాణ సమాజం తరఫున అన్నాను తప్ప, నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద కోపం ఎందుకు ఉంటుంది.
తెలంగాణ సంపద మీద అందరు గుంటనక్కలు మాదిరి కన్నేసి ఉన్న రు. ఇప్పుడు ఉన్న పాలకులు సరి గా చేస్తలేరట, మంచిగా పాలన చేయాలంటే చంద్రబాబు రావాల ట, తెలంగాణలో వచ్చే సారి ఎన్డీఏ కూటమి రావాలని కొన్ని పత్రికలు కథనాలు రాస్తున్నాయి… అంటే తెలంగాణను తెర్లు జేయాలని చూసే వాళ్ల పరిస్థితి ఏమిటో మనం అర్థం చేసుకోవచ్చు.
తెలంగాణను ఆగం చేయడానికి కొందరు రెడీగా ఉంటారు. వీరి పట్ల తెలంగాణ యువత అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు తెలంగా ణను ఆగం చేసి కుట్రలను పసిగట్టి కాపాడుకోవాలి. ఒక పొరపాటు జరిగితే జీవితకాలం దుఃఖపడాల్సి వస్తది.ఎనిమిది మంది బిజెపి ఎం పీలను, ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలను గెలిపిస్తే… ఏకానా కూ డా పని కాలేదు.
తెలంగాణ నుంచి మన బి ఆర్ ఎస్ ప్రతినిధులను పార్లమెంటుకు పం పిస్తే…కొట్లాడి మన హక్కులు కాపా డుకుందుము కదా. మన దగ్గర ఎం పీల బలం ఉంటే, కేంద్రం మీద ఒ త్తిడి చేసి రాష్ట్రాన్ని బాగు చేసుకు నే అవకాశం ఉంటుంది.ఇప్పటికైనా ఈ దిశగా తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, వంటేరు ప్రతాపరె డ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు, తో సహా పాద పాదయా త్రలో పాల్గొన్న టిఆర్ఎస్ నేతలు తోపాటు వందలాది కార్యకర్తలు పాల్గొన్నారు.