Kishan Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ ప్రజలకు ఇచ్చిన గ్యా రంటీలను అమలు చేయలేక సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ, వ్యక్తిగతంగా తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నా నారని బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. బాధ్యతార హితంగా, వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడుతున్నారని అన్నారు. రాష్ర్టాలకు సంబంధించిన ప్రాజె క్టుల మంజూరు, నిధుల కేటా యిం పులో తనపై చేసిన ఆరోపణలను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. బీజేపీ గెలుపు కోసమో, రెచ్చగొట్టడం కోస మో రాజకీయాలు చేయదన్నారు. దేశం, రాష్ర్టం అభివృద్ధి చేయాలనే దే తమ నినాదమని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. హైదరా బా ద్ 150 కార్పొరేషన్లలో 50 శాతం బీసీ లకు కేటాయించిన సీట్లలో 30 సీట్లలో నాన్ బీసీలు గెలుచుకొని ల బ్ధి పొందుతుంటే నోరు మూసుకొని కూర్చోవాలంటే వారికి జనాభా ప్రా తిపదికన హక్కులు రావాలని బీజే పీ పోరాడుతుందన్నారు. ఇది సీ ఎం రేవంత్ నిజస్వరూపమని మం డిపడ్డారు. శనివారం తప్పుడు ఆ రోపణలను తిప్పికొడుతూ రాష్ర్ట బీజేపీ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. అను భవ రాహిత్యంతో మాట్లాడుతు న్నారని అన్నారు. తాను తెలంగా ణ అభివృద్ధిపై అనేక ప్రాజెక్టులపై ప్రజలకు వివరిస్తూనే ఉన్నానని చెప్పారు. గత పదేళ్లుగా అనేక కేంద్ర పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. కొన్ని కేంద్ర ప్రభుత్వ పథకాల్లో రాష్ర్ట ప్రభుత్వం సహకారం అందిం చకపోవడం వల్ల అమలు చేయలే దన్నారు. పంటలబీమా, ఆయుష్మా న్ భవ ఉదాహరణలన్నారు.
తప్పుడు ఆరోపణలపై ఎదురు దాడి.. కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తు న్నా మని చెప్పారు. 14 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తామన్న వందరో జుల్లో ఆరు గ్యారంటీలు, 320 సబ్ గ్యారంటీల అమలులో పూర్తిగా వై ఫల్యం చెందిందన్నారు. అన్ని వర్గా ల ప్రజల్లో వ్యతిరేకత చోటు చేసు కుందన్నారు. దాన్ని కప్పిపుచ్చుకు నేందుకు, ప్రజల దృష్టిని మళ్లిం చేందుకు తనపై ఎదురుదాడి, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో నేడు అంతర్గత కుమ్ములాటలు, సీఎంపై అసంతృప్తి ఆయన మాట్లా డుతున్న విధానంలో స్పష్టంగా కనిపిస్తుందన్నారు. బీజేపీ, తనను బ్లాక్ మెయిల్, బీజేపీని బెదిరించి నంత మాత్రాన, అబద్ధాలు మాట్లా డినంత మాత్రాన ఆయనపై ఉన్న వ్యతిరేకత పోదన్నారు. నేడు తెలంగాణ ప్రజలు ఆయన మాట లు వినే పరిస్థితి లేదన్నారు.
దిగజారుడు ఆరోపణలు.. అనేక హామీలకు నమ్మి ఓటేస్తే ఏది అమలు చేయలేదని ఏ సామాజిక వర్గం సీఎం రేవంత్ రెడ్డి మాటలను సీరియస్ గా తీసుకునే పరిస్థితులు లేవన్నారు. పెద్ద గొంతుతో మాట్లా డినంత మాత్రాన సమస్యలు పరి ష్కారం కావన్నారు. గతపదేళ్లుగా తెలంగాణలో ఏం చేశామనే విష యం ఇదివరకే ప్రజలంతా చూశార న్నారు. రూ. 10 లక్షల కోట్లతో రెండు న్నరగంటలపాటు ఆర్టీసీ కళ్యాణ మండపం, పింగళి భవన్ లో వివరించామన్నారు. కేంద్ర మంత్రి బెదిరిస్తున్నారని దిగజారి సీఎం మాట్లాడుతున్నారని విమ ర్శించారు. ఇవన్నీ దిగజారుడు, దివాళా కోరు ఆరోపణలన్నారు. మూడున్నరేళ్లుగా అంకితభావంతో తెలంగాణ అభివృద్ధి కోసం పనిచే స్తున్నట్లు తెలిపారు. జాతీయ రహ దారులు, రైల్వే ప్రాజెక్టులు, కేంద్ర కార్యాలయాలు, విద్యాలయాలు, మౌలిక సదుపాయాలపై కేంద్రానికి వివరించి అభివృద్ధిని దరిచేర్చేలా నిర్ణయం తీసుకున్నామన్నారు.
తప్పులు రుద్దితే ఊరుకునేది లేదు.. …దేశంలో ఏడు టెక్స్ టైల్స్ పార్కులు వస్తే ఒకటి తెలం గాణకు ఇండస్ర్ఈయల్, కోచ్ ఫ్యా క్టరీ, రీజినరల్ రింగ్ రోడ్డు వంటి కీలకమైన ప్రాజెక్టులను తీసుకువ చ్చానన్నారు. నైతిక విలువలతో కూడిన రాజకీయాలకు తాను ప్రాధాన్యతనిస్తానని అన్నారు. అంతేగానీ ప్రాజెక్టులు అడ్డుకోవడం లాంటివి కూడా ఊహించడం తప్పే అవుతుందన్నారు. తాను చిన్న ప్పటి నుంచి అయినా ఒక సిద్ధాం తానికి కట్టుబడి పనిచేసేవాడినని, తాటాకు తప్పుళ్లకు భయపడబో నన్నారు. తనమీద తప్పు రుద్దితే ఊరుకోబోనన్నారు. దేశం ప్రజలకు హామీ ఇచ్చిన మేరకు వాటికి క ట్టుబడి ఉండి వాటిని అమలు చే స్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభయహస్తం పేరుతో మేనిఫెస్టో ను ప్రకటించిందని ఇవన్నీ అమలు చేయాలని కేంద్రమంత్రి డిమాండ్ చేశారు. ఇవన్నీ అమలు చేయ కుండా తనపై ఆరోపణలు చేస్తు న్నారని ఆరోపించారు. డిసెంబర్ 24 లోపల రెండు లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడరెందుకని నిల దీశారు. రైతులకు సంబంధించి ఇచ్చిన హామీలు మాట్లాడే పరిస్థితి లేదన్నారు. ఇందిరమ్మ రైతు భరో సా రూ. 15వేలు, కౌలు రైతులకు రూ. 15వేలు, రైతు కూలీలకు రూ. 12వేలు, పది పంటలపై అదనపు రూ. 5వేల బోనస్, రూ. 5 లక్షల ఇంటి స్థలం, విద్యాభరోసా కార్డు, పెన్షన్ రూ. 4 వేలు లాంటి విష యాలలో తన బాధ్యతను విస్మరిం చి ప్రవర్తిస్తున్నారని, గాలిమాటలు మాట్లాడుతున్నారని విమర్శించా రు.
ప్రజల సర్టిఫికెట్ చాలు, సీఎం సర్టిఫికెట్ అవసరం లేదు.. తన కు రాసిన లేఖలో రూ. 1,66,56 9.31 కోట్ల నిధులు మంజూరు చే యాలని డిమాండ్ చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రానికి కూ డా ఇంత పెద్ద ఎత్తున నిధులు మం జూరు చేసిన పరిస్థితి లేదన్నారు. మరీ రాష్ర్ట ప్రభుత్వం ఈ ప్రాజెక్టుల కు ఎన్ని నిధులు కేటాయించారో? చెప్పాలని నిలదీశారు. ఈ ప్రాజె క్టులపై కేంద్ర ప్రభుత్వం ఎక్కడైనా హామీ ఇచ్చిందా? మేనిఫెస్టోలో పె ట్టిందా? అని నిలదీశారు. సీఎం మాటలకు అధికారులే నవ్వుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. సీఎం ఇ చ్చిన వివరాలను ఆయా మంత్రుల వారీగా విభజించి జనవరి 23, నితి న్ గడ్కరీ, అశ్వనీ వైష్ణవ్, మనోహ ర్ లాల్ కట్టర్ లకు పంపించామ న్నారు. ఇంత పద్ధతి ప్రకారం తా ము పనిచేస్తామన్నారు. వాస్తవం ఈ రకంగా ఉంటే తాను ప్రాజెక్టుల ను అడ్డుకుంటున్నామని వితండ వాదం చేసే ప్రయత్నాలకు తెరతీశా రన్నారు. కేవలం రెండున్నర నెలల్లో ఇంత పెద్ద ప్రాజెక్టులు మంజూరు అవుతాయా? అని ప్రశ్నించారు. రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు మం జూరు చేయించిందే తానన్నారు. ఈ విషయంలో తాను కేసీఆర్ కు కూడా అనేక లేఖలు రాశానన్నారు. భూసేకరణపై 50 శాతం రాష్ర్ట ప్ర భుత్వం అందించాలని అనేకసార్లు విన్నవించామన్నారు. సీఎం రేవంత్ కు కూడా లేఖ రాశామన్నారు. రింగ్ రోడ్డుకు రాష్ర్ట ప్రభుత్వం వందకో ట్లు కేటాయించిందన్నారు. త్వరలో మంజూరు కాబోతుందన్నారు. తొ లిదశ పనులపై కేబినెట్ ఓకే చెప్ప నుందని, దీనికి సీఎం సర్టిఫికెట్ అవసరం లేదని, తెలంగాణ ప్రజల సర్టిఫికెట్ ఉంటే చాలన్నారు.
మెట్రో అలైన్ మెంట్ మా ర్చా రు, రూ. 317 కోట్లకు పెంచారు
రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఫేజ్ 2 రింగ్ రోడ్డును నిర్మించుకుంటామని అన్ని పత్రికల్లోనూ యాడ్ లు కూ డా ఇచ్చారన్నారు. దీనితో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదన్నా రు. ఇన్ని లోపభూయిష్ట విధానాల కు పాల్పడుతూ తమపై ఆరోప ణలు చేయడం సరికాదన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడే మెట్రో 2 ఫేజ్ కేంద్ర ప్రభుత్వం అనుమతి లభిం చిందన్నారు. సీఎం రేవంత్ రాగానే కేంద్రానికి లేఖ రాసి మెట్రో సమగ్రం గా లేదని 2024 జనవరి 4న ఢిల్లీకి హర్దిప్ సింగ్ పూరిని కలిసి కొత్త ప్రతిపాదన విషయాన్ని తెలిపార న్నారు. 2024 అక్టోబర్ 26 వరకు కూడా రాష్ర్ట ప్రభుత్వం ప్లానింగ్, ప్రణాళిక కేంద్రానికి అందలేద న్నా రు. బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 234 కోట్లతో ప్రతీ కిలోమీర్ కు, 76 కి. మీ. పొడవుతో ప్రతీ కిలోమీటర్ కు రూ. 317 కోట్లకు పెంచుకుందా న్నారు. తొలిదశలో ఫలక్ నుమా వరకు అయ్యే ఖర్చులో కేంద్రం రూ 1200 కోట్లు మెట్రోకు ఇచ్చామన్నా రు. అఫ్జల్ గంజ్ లోనే దాన్ని ఆపివే శారన్నారు. ఇప్పుడు జరుగుతుం దన్నారు. ఒక ప్రాజెక్ట్ ప్రతిపాదన వస్తే ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించాక కేబినెట్ లో సమర్పిం చాల్సి ఉంటుందన్నారు. మీకే పది నెలలు పడితే ఏ ప్రాతిపదికన కేం ద్రం, బీజేపీ, కిషన్ రెడ్డి అడ్డుకున్నా రని అంటారని ప్రశ్నించారు. తెలం గాణలో చేపట్టే ఏ ప్రాజెక్టును ఆల స్యం, అడ్డుకునే అవకాశమే లేద న్నారు. మోదీ నేతృత్వంలో అన్ని పనులు సకాలంలో జరుగుతాయ న్నారు. ముస్లిం రిజర్వేషన్ వ్యతి రేకతపై ఆంధ్రలో స్వతంత్రంగా బీజే పీ ప్రభుత్వం వస్తే రద్దు చేస్తామన్నా రు. మతపరమైన రిజర్వేషన్లను రద్దు చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు క లుపుతామని ఆ విషయానికి కట్టు బడి ఉన్నామని చెప్పారు. ముస్లిం లకు ఇప్పకే ఈబీసీ రిజర్వేషన్లు కల్పించామన్నారు. హైకోర్టు తీర్పు ను గౌరవించడం ఏ రకంగా తప్పు అవుతుందో సీఎం రేవంత్ చెప్పా లని నిలదీశారు.