Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Leaders Prasad : నిర్వీర్యమవుతోన్న చట్టాలను పరి రక్షించుకోవాలి

–కార్మిక సంఘం జాతీయ నాయ కులు ప్రసాద్

Leaders Prasad : ప్రజా దీవెన, హైదరాబాద్: కార్పొరేట్ కబంద హస్తాల్లోకి వెళ్లిన మీడియాను, వర్కింగ్ జర్నలిస్టుల చట్టాలను రక్షించుకోడానికి ఉదృ తంగా జర్నలిస్టు సంఘాలు పోరా టాలు చేయాల్సిన అవసరం ఉంద ని ప్రముఖ కార్మిక సంఘ జాతీయ నాయకులు పి. ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ట్రేడ్ యూనియన్ ఆర్గనైజేషన్ గా పనిచేస్తున్న తెలం గాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) చైత న్యవంతం కావాల్సిన అవసరం ఎం తైనా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. శుక్రవారం బషీర్ బాగ్ లోని సురవరం ప్రతాప్ రెడ్డి ఆడిటో రియంలో, తెలంగాణ స్టేట్ యూని యన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆ ధ్వర్యంలో, యూనియన్ రాష్ట్ర అ ధ్యక్షులు కే.విరాహత్ అలీ అధ్య క్షతన ‘జర్నలిజం- వృత్తి సంఘం’ అనే అంశంపై, 33 జిల్లాల యూని యన్ అధ్యక్ష, కార్యదర్శులకు ఒక రోజు వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రసాద్ మాట్లాడు తూ సామాజిక స్పృహ కలిగిన ఈ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘానికి ఎంతో ఉద్యమ చరిత్ర ఉందన్నారు. ప్రస్తు తం మీడియా రంగంలో వస్తున్న మార్పులపై జర్నలిస్ట్ సంఘం వర్క్ షాప్ నిర్వహించడం అభినందనీ యమన్నారు. మునుముందు జిల్లా, మండల స్థాయిలో సైతం జర్నలిస్టులను చైతన్యపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గతంలో మాదిరిగా కాకుండా మీ డియా పూర్తిగా బడా కార్పోరేట్ పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్లిం దని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో అక్షర జ్ఞానాన్ని అందించి వేతనాలు పొందిన జర్నలిస్టులు తదనంతరం వార్తలు పంపి టిప్స్ పొందే పరిస్థితి ఉండేదన్నారు. కానీ నేడు యాజమాన్యాలు విధించే టా ర్గెట్స్ కనుగుణంగా యాజమాన్యా లకే జర్నలిస్టులు డబ్బులు ఇచ్చే దుస్థితి ఏర్పడిందన్నారు. యాజ మాన్యాల టార్గెట్లతో మండల, డివి జన్ స్థాయిలో పనిచేసే జర్నలిస్టు లు బెదిరిపోతున్నారని పేర్కొన్నా రు. దీంతో సమాజంలో జర్నలిస్టుల పట్ల చులకన భావం ఏర్పడుతుంద న్నారు. విధి నిర్వహణలో సామాజి క స్పృహతో ముందుకు వెళుతూ పరాయికరణ నుండి బయట పడా ల్సిన అవసరం ఉందని సూచిం చారు. సమాజంలో మళ్లీ పాత్రికే యుల పాత్ర కీలకమైన పరిస్థితులు రావాల్సిన అవసరం ఉందని అభి ప్రాయపడ్డారు. హక్కుల సాధన కో సం నిరంతరం పోరాడాల్సిన అవ సరం ఉందని జర్నలిస్టులకు ఆయ న పిలుపునిచ్చారు. జర్నలిస్టులు ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాలని, ఉత్తమ పౌరులుగా జీవించాలని ఆ యన సూచించారు. మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మారుతున్న చట్టా లతో ప్రతి జర్నలిస్టు జాగ్రత్తగా ఉం డాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఐజేయూ జాతీయ అధ్యక్షులు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి సూచిం చా రు. ఎన్నో ఏళ్లుగా ఉద్యమించి జర్నలిస్టుల సంక్షేమం కోసం సాధిం చుకున్న చట్టాలను కేంద్ర ప్రభు త్వం పథకం ప్రకారం మార్చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలో 44 చట్టాలు ఉండగా 29 చట్టాల ను మార్చి 4 లేబర్ కోడ్ లుగా తెచ్చిందన్నారు. కొత్త చట్టాలు అన్నీ కూడా వేల కోట్ల పెట్టుబ డిదారుల యజమానులకు అను కూలంగా తయారు చేసినవేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మారుతున్న కొత్త చట్టాలకు అను గుణంగా క్షేత్ర స్థాయిలో సంఘ కార్యకలాపాలను నిబంధనల మేరకు నిర్వహించాలని సూచిం చారు. జర్నలిస్టులపై దాడులు జరిగితే మానవీయంగా ఆలోచించి ఖండించాల్సిన బాధ్యత జర్నలిస్టు సంఘాలపై ఉంటుందన్నారు. సం ఘ ప్రయోజనం, ప్రతిష్టను దెబ్బతీ సే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చ రించారు. ఈ సందర్భంగా అనేక అంశాలపై శ్రీనివాస్ రెడ్డి అవగాహ న కల్పించారు. సంఘ బాధ్యుల ప లు సందేహాలను ఆయన నివృత్తి చేశారు. ఈ సమావేశంలో యూ నియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రాంనారాయణ స్వాగతం పలక గా, ఐజేయు స్టీరింగ్ కమిటీ సభ్యు లు దేవులపల్లి అమర్ మాట్లా డారు. ఐజేయు స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎం.ఏ.మాజీద్, కార్య దర్శి వై.నరేందర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు కె. సత్యనారా యణ, నగునూరి శేఖర్, టీయూ డబ్ల్యూజే రాష్ట్ర ఉప ప్రధాన కార్య దర్శి కె.రాములు, ఉపాధ్యక్షులు ఫైసల్ అహ్మద్, బి.సంపత్, గాడి పల్లి మధు, రాష్ట్ర కార్యదర్శులు వి.యాదగిరి, కె.శ్రీకాంత్ రెడ్డి, కోశాధికారి యం.వెంకట్ రెడ్డి, రా ష్ట్ర కార్యవర్గ సభ్యులు బి.కిరణ్, ఏ.రాజేష్, రాజేశ్వరి, డిజి శర్మ, ఎలగందుల రవీందర్, కె. రాజిరెడ్డి, తెలంగాణ రాష్ట్ర చిన్న, మధ్యత రగతి పత్రికల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యూసుఫ్ బాబు, అశోక్ తదితరులు పాల్గొ న్నారు.