Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Railway Passengers : కీలక ప్రకటన, టికెట్‌ తీసుకుంటే 3శాతం క్యాష్‌బ్యాక్‌

Railway Passengers : ప్రజా దీవెన, హైదరాబాద్‌: రైల్వే ప్రయాణికులకు అన్‌రిజర్వ్‌డ్‌ టికెటింగ్‌ సిస్టం(యూటీఎస్‌) యాప్‌ ద్వారా టికెట్లు తీసుకుంటే 3 శాతం క్యాష్‌ బ్యాక్‌ వంటి సేవలు కల్పిం చింది దక్షిణ మధ్య రైల్వే. విని యోగదారుడికి అనుకూలమైన డిజి టల్‌ పద్దతులను ప్రవేశపెట్ట డంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఊరెళ్లేందుకు రైల్వే స్టేషన్‌కు రావడం బుకింగ్‌ కౌంటర్‌ వద్ద రద్దీ ఉండడం చూసిన కొందరు ఏటీవీఎం (ఆటోమెటిక్‌ టికెట్‌ వెండిరగ్‌ మిషిన్‌)లను ఆశ్రయిస్తు న్నారు. దక్షిణ మధ్య రైల్వే ప్రయా ణికులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు 2016లో హైదరాబా ద్‌ జంట నగరాల్లో 26 సబర్బన్‌ స్టేషన్‌లలో జోన్‌ వారీగా యూటీ ఎస్‌ మొబైల్‌ ఆప్లికేషన్‌ను ప్రశేపె ట్టింది. 2018 జూలైలో రైల్వేలోని అన్ని స్టేషన్లను యూటీఎస్‌ కవర్‌ చేస్తూ ప్లాట్‌ ఫాం ప్రయాణ టికెట్లు బుకింగ్‌ కోసం అన్ని నాన్‌-సబర్బన్‌ స్టేషన్లకు ఈ సౌకర్యం విస్తరించబ డిరది. ఆధునిక టికెట్‌ వ్యవస్థలో యూటీఎస్‌ యాప్‌ ప్రయాణికులకు సులువుగా మారింది.

 

రైల్వేలో రిజర్వ్‌ చేయని టికెట్లపై ప్రయాణిం చే వారికి ఇదోక వరమని చెప్పవ చ్చు. డిజిటల్‌ ఇండియా విధానా నికి అనుగునంగా ఈ యాప్‌ నగ దు రహిత లావాదేవీలను అను మతిస్తుంది. అదే విధంగా ప్రయాణికులకు సులువుగా ఉండేందుకు ఆర్‌-వాలెట్‌, పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌పే, లేదంటే ఇంటర్నెంట్‌ బ్యాకింగ్‌ వంటి డిజిటల్‌ మోడ్‌ల ద్వారా చెల్లించేందుకు వెసులుబాటు కల్పించారు. ప్రయాణికులకు ఇష్టం ఉంటే రూ. 20 వేల వరకు డిపాజిట్‌ చేసుకునే విధంగా సౌకర్యాల్ని కల్పించారు. ఆర్‌ వాలెట్‌ ద్వారా టికెట్లు కొనుగోలు చేసుకునే ప్రయాణికులకు రైల్వే యంత్రాంగం 3 శాతం క్యాష్‌ బ్యాక్‌ ఇస్తున్నారు. ఆన్‌లైన్‌ టికెట్ల కొనుగోలు విషయంలో రోజు రోజుకు విక్రయాలు క్రమంగా పెరుగుతున్నాయి. యూటీఎస్‌ యాప్‌ ద్వారా 2023-24లో ఏప్రిల్‌ నుంచి జనవరి వరకు ఒక రోజులో 83.510 మంది ప్రయాణికులు సేవలు వినియోగించుకున్నారు. 2024-25 ఏడాదిలో ప్రతి రోజుకు 93,487 ప్రయాణికులు ఆన్‌లైన్‌ సేవలు వినియోగించుకున్న క్రమంలో 12 శాతం పెరిగిందని రైల్వే అధికారులు ప్రకటించారు. స్మార్ట్‌ఫోన్‌ ఉన్న వారు దాదాపు రైలు ప్రయాణం కోసం ఇంటి నుంచే ఆన్‌లైన్‌ సేవలు వినియోగించుకుంటున్నారు. స్మార్ట్‌ఫోన్‌లో యూటీఎస్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని టికెట్‌ కొనుకుని సులువుగా రైలు ప్రయాణం చేయవచ్చు. లేదంటే ప్రయాణికులు నేరుగా బుకింగ్‌ కౌంటర్‌ వద్దకు వచ్చి కౌంటర్ల వద్ద యూటీఎస్‌ క్యూ ఆర్‌ కోడ్‌ను వినియోగించుకోవచ్చు.