Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Road Accident : విషాదం, రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం

Road Accident : ప్రజా దీవెన హైదరాబాద్: అంతర్ రాష్ట్ర సరిహద్దు కర్ణాటక రాష్ట్రం కో లార్ జిల్లా బంగారుపేట తాలూకా కుప్పనల్లి సమీపంలో ఇటీవల మొ దలైన ఎక్స్ ప్రెస్ గ్రీన్ వే లో ఆదివా రం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మండల కేంద్రాని కి సరిహద్దుల్లో ఉన్న కదిరిగాని కుప్పకు చెందిన సీనప్ప కుమారు డు మహేష్ కుటుంబ సభ్యులతో కలిసి వాళ్ళ నాన్నను బెంగుళూరు ఆసుపత్రిలో ఉండగా చూసుకొని తిరుగు ప్రయా ణంలో కారులో వస్తున్నారు. కేజీ ఎఫ్ – బంగారు పేట్ మధ్యన కు ప్పనల్లి సమీపంలో ఎదురుగా ద్వి చక్ర వాహనం లైట్లు లేకుండా రావ డంతో ప్రమాదవశాత్తు కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొంది.

ఈ ఘటనలో ద్విచక్ర వాహనదా రుడి తో పాటు కారులో ప్రయాణి స్తున్న కదిరిగాని కుప్పంకు చెందిన సీనప్ప కుమారుడు మహేష్ (52), కమ్మ సంద్రంకు చెందిన జయ రామప్ప భార్య రత్నమ్మ(60), సంతోష్ కుమార్తె ఉద్విత (2) తో పాటు ద్విచక్ర వాహనం నడుపుతున్న యువకుడు ఘటనా స్థలంలో మృతిచెందారు. అలాగే కారులో ప్రయాణిస్తున్న సంతోష్ భార్య సుస్మిత (30), ఆమె కుమారుడు విరాట్ (6), సుజాత (48) కారు డ్రైవర్ సునీల్(28)లు తీవ్రంగా గాయపడ్డారు. వారిని కోలార్ లోని జాలప్ప మెడికల్ ఆసుపత్రికి తరలించారు.

8నెలల గర్భిణీ అయిన సుస్మిత కడుపులోని పాపను కాపాడేందుకు ఆపరేషన్ చేసినా ఫలితం లేకపోగా పాప మృతిచెందింది. ఆమె మృత్యువు తో పోరాడుతోంది.ఒకే కుటుంబా నికి చెందిన బంధు వులందరూ రో డ్డు ప్రమాదానికి గురై ముగ్గురు మృ తిచెందడంతో ఆ కుటుంబంలో తీ రని విషాదఛాయలు అలముకు న్నాయి. ఎక్స్ ప్రెస్ వే లో వాహనా ల రాకపోకలకు అనుమతించిన బంగారు పేట – కేజిఎఫ్ మధ్య ఒకే వైపు అటు, ఇటు వచ్చే వాహనా లు వెళ్లి వస్తుం డటంతో ఈ ప్రమా దం చోటు చేసుకున్నట్లు తెలు స్తోంది. బంగారు పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.