Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Slbc tunnel : అదే ఉత్కంఠ, టన్నెల్ లోనే రెస్క్యూ టీమ్ లు

Slbc tunnel : ప్రజా దీవెన హైదరాబాద్: నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ సొరంగంలో ఆరంభం నుంచి కొనసాగుతున్న ఉత్కంఠత ఇప్పటికి అదే తరహాలో కనపడు తుంది. సొరంగంలో చిక్కుకున్న ఆ ఎనిమిది మందిని రక్షించేందుకు ప్రభుత్వం ర్యాట్ హోల్స్ మైనర్స్ను రంగంలోకి దించుతోంది. టన్నెల్లో చిక్కుకున్న 8 మంది ఆచూకీ కోసం ఆరుగురు సభ్యుల స్పెషల్ టీమ్ వెళ్లనుంది. ఈ ప్రత్యేక బృందం ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు చేరుకొన డం ద్వారా ఎస్ఎల్బీసీ వద్దకు చేరుకుంది. 8 మంది ఆచూకీ కోసం తమ ప్రయత్నాలను ప్రారంభిం చింది. అయితే 2023లో ఉత్తరా ఖండ్ సిల్కీయారా సొరంగంలో 41 మంది కార్మికులు చిక్కుకోగా అధి కారులు 17 రోజులు వారి ఆచూకీ కోసం ప్రయత్నించి విఫలం కాగా ర్యాట్ హోల్ మైనర్లు ఒక్క రోజు లోనే కార్మికులను గుర్తించి సురక్షి తంగా బయటకు తీసుకురా వడం లో ప్రధాన పాత్ర పోషించారు.

ఎస్ఎల్బీసీ ప్రమాదంపై వారిని ప్రశ్నించగా ఇక్కడ పరిస్థితులు వేరుగా ఉన్నాయని చెప్పారు. కాగా మూడోరోజు రెస్క్యూ బృం దాలు తమ ప్రయత్నాలను కొన సాగిస్తున్నారు. రాష్ట్ర డిజాస్టర్ మే నేజ్మెంట్ స్పెషల్ చీప్ సెక్రటరీ అర వింద్ కుమార్, హైడ్రా కమిషన్ రం గనాథ్, జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్, ఎస్పీ రఘునాథ్ గైక్వాడ్, ఆర్మీ ఉన్నతాధికారులు తదితరు లతో రెస్క్యూ ఆపరేషన్ పై తీసుకో వాల్సిన జాగ్రత్త లపై చర్చిస్తున్నా రు. మంత్రులు జూపల్లి కృష్ణారావు ఎస్ఎల్బీసీ వద్దే ఉంటూ పరిస్థితి సమీక్షిస్తున్నారు. ఈ ఘటనపై సీ ఎం రేవంత్రెడ్డికి సహాయక చర్యలపై సమాచారం అందిస్తున్నారు.

ఘటనాస్థలిలో మంత్రి కోమటి రెడ్డి పర్యవేక్షణ… ఎస్ఎల్బీసీ సొరంగం వ ద్ద సహాయక చర్యలపై రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమా టోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు.
ఎంత కష్టమైనా సరే టన్నెల్ లో చిక్కుకున్న 8 మందిని కాపాడేం దుకు ఉన్న అన్ని మార్గాలను ప్రయ త్నించాలని అధికారులను మంత్రి ఈ సందర్భంగా ఆదేశించారు. దేశ వ్యాప్తంగా జరిగిన టన్నెల్ ప్రమాద సంఘటనల్లో చిక్కుకున్న భాధితు లను కాపాడిన నిపుణుల అనుభ వాలను తీసుకోవాలని సూచించా రు. ఆయనతో పాటు హాజరైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జానారెడ్డి, ఎమ్మెల్యేలు బాలు నాయక్, జైవీర్ రెడ్డి ఇండియన్ ఆర్మీ మేజర్ జనరల్ అజయ్ మిశ్రా, అరవింద్ కుమార్, హైడ్రా రంగనాథ్, ఇతర ఉన్నతాధికా రులు పాల్గొన్నారు.