TRTF Chief Secretary: తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా తరాల పరమేశ్ యాదవ్..
TRTF Chief Secretary: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్:
తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ టీఆర్టీఎఫ్ నల్లగొండ జిల్లా నూతన ప్రధాన కార్యదర్శి (TRTF Chief Secretary)గా తరాల పరమేశ్ యాదవ్ (Tarala Parmesh Yadav)ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారెడ్డి అంజిరెడ్డి తెలిపారు. ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని టీఆర్టీఎఫ్ జిల్లా శాఖ కార్యాలయంలో జరిగిన జిల్లా అత్యవసర సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఏకగ్రీవంగా నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తరాల పరమేశ్ యాదవ్ కు నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా మారెడ్డి అంజిరెడ్డి (Mareddy Anjireddy) మాట్లాడుతూ 80 సంవత్స రాల నుండి అనగా స్థాపించిన 1944 వ సంవత్సరం నుంచి ఉపాధ్యాయుల శ్రేయస్సుకై, సమస్యల పరిష్కారానికి పాటుపడిన సంఘం టీఆర్టీఎఫ్ అని అన్నారు. సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో సభ్యత్వం కలిగిన గుర్తింపు పొందిన టీఆర్టీఎఫ్ సంఘం భవిష్యత్తులోనూ ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి, ఉపాధ్యాయ ఉద్యోగులకు పెండింగ్ డీఏలు, బిల్లులు, మెరుగైన పీఆర్సీ ఇప్పించేందుకు సంఘం కట్టుబడి ఉందని అన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా తరాల పరమేశ్ యాదవ్ ఎన్నికతో సంఘం మరింత బలోపేతమవుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు.
నూతనంగా TRTF జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తరాల పరమేశ్ యాదవ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో జిల్లా ప్రధాన కార్యదర్శిగా సంఘానికి, ఉపాధ్యాయు లకు సేవ చేసే అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారెడ్డి అంజిరెడ్డి, రాష్ట్ర, జిల్లా బాధ్యులకు ధన్యవాదాలు తెలుపు తున్నానని అన్నారు. నల్లగొండ జిల్లాలో ఉపాధ్యాయులకు మెరు గైన సేవలు అందించుట ద్వారా జిల్లాలో సంఘ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. టీఆర్టీఎఫ్ జిల్లా అధ్యక్షులు నిమ్మనగోటి జనార్ధన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పూర్వ రాష్ట్ర అధ్యక్షులు ముప్పిడి మల్లయ్య, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి తంతెనపల్లి సై దులు, రాష్ట్ర కార్యదర్శి బి.సూర్య నారాయణ, దొడ్డేని సాయిబాబు, జలంధర్ రెడ్డి, జానకిరెడ్డి, అర్రూరి జానయ్య, ఎల్.నగేష్, బి.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
* పరమేశ్ యాదవ్ కు పలువురి శుభాకాంక్షలు
టీఆర్టీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తరాల పరమేశ్ యాదవ్ కు ప్రపంచ ఉపాధ్యాయ సమాఖ్య సెక్రటరీ (Secretary of the World Federation of Teachers) జనరల్ ఎం.వీ. గోనారెడ్డి, నకిరేకల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా॥బెల్లి యాదయ్య, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చక్రహరి రామరాజు, నేలపట్ల సత్యనారాయణ, బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు ఓలి సమీర్ కుమార్, బీసీటీయూ జిల్లా అధ్యక్షులు కొన్నె శంకర్ గౌడ్, వైద్యుల సత్యనారాయణ, దూది గామ స్వామి, లక్ష్మయ్య, కృష్ణ, నర్సింహ, గుండెబోయిన జానయ్య, బాతుక శ్రీనివాస్, సోమన బోయిన లింగస్వామి, బెల్లి నాగరాజు, లక్ష్మీనారాయణ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.