Volunteer : ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) మరియు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) ఆధ్వర్యంలో జిల్లా గ్రామీణ సంస్థ నల్లగొండ నందు రెండో విడత శిక్షణ 24.02.2025 నల్లగొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ జె. శ్రీనివాస్ ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. 12 రోజులపాటు ఇవ్వబడే ఇట్టి శిక్షణ కార్యక్రమంలో ఎన్డీఆర్ఎఫ్ అధికారులు, జిల్లా ఫైర్, అటవీ, వైద్య రెవిన్యూ, పోలీసు, పంచాయతీరాజ్, మృత్య శాఖ, వివిధ ఇంజనీరింగ్ శాఖల అధికారులు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇట్టి శిక్షణలో మంటలు, వరదలు, భూకంపాలు మొదలు విపత్తులు నిర్వహణ, ప్రతిస్పందన తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రాణాపాయస్థితిలో ఉన్న వారికి రక్షించడం, ప్రధమశచికిత్స చేయడం వివిధ శాఖలతో సమన్వయం చేసుకోవడం మొదలు అంశాలపై అవగాహన కల్పించడం జరుగుతుంది అని తెలిపారు. రెండో విడత శిక్షణలో పూర్తిగా మహిళలకు ఇస్తున్నారు.
ఈ శిక్షణ లో భాగంగా రెండు రోజులు రెండు గ్రూపులలో (నాలుగు గ్రామాలు) గ్రామాల క్షేత్ర స్థాయి సందర్శన చేయించడం మరియు పానగలు ఉదయ సముద్రంలో పైర్ ముత్యశాఖ ఆధ్వర్యంలో చెరువుల్లో చిక్కుకున్న వారిని రక్షించడం, ప్రాక్టికల్ గా శిక్షణ ఇవ్వడం జరుగుతది అని తెలిపారు. శిక్షణతో పాటు ఆపదమిత్ర వాలంటీర్లు అందరికీ ప్రతిరోజు హార్ట్ఫుల్ నెస్ మెడిటేషన్ పై, శ్రీ రామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించడం జరుగుతుంది. ఇట్టి శిక్షణ కార్యక్రమం జిల్లాలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వై. శేఖర్ రెడ్డి జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి/ ఆపద మిత్ర నోడల్ అధికారిగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. ఇట్టి ప్రారంభ కార్యక్రమంలో వై. శేఖర్ రెడ్డి జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి, జిల్లా పరిషత్ సీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి , జిల్లా మృత్య శాఖ అధికారి చరిత, వైద్యాధికారి మాతృ, డాక్టర్ ఎంసీఆర్ హెచ్ఎర్డిఐటి ప్రాంతీయ శిక్షణ మేనేజర్ పి. వెంకటేశ్వర్లు, డిఆర్డిఏ డిపిఎం మోహన్ రెడ్డి, జిల్లా అధ్యక్షురాలు నాగమణి,డాక్టర్ తరుణ్, ఈజీ ఎం ఎమ్ ఉద్యోగులు తదితరులు ఫాల్గున్నారు.