Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Emergency in India : చీకటి అధ్యాయానికి నేటితో యాభై ఏళ్ళు.

*ప్రజల హక్కులను కాలరాసిన నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం*
*డి కే అరుణ పార్లమెంట్ సభ్యులు*
Emergency in India : ప్రజా దీవెన, నల్గొండ టౌన్: ఎమర్జన్సీ అరాచకాలను ప్రజలలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా వుందని , చీకటి అధ్యాయానికి నేటితో యాభై ఏళ్ళు గడుస్తున్న నాటి అరాచకాలను ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యులు, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీ కే అరుణ గుర్తుచేశారు.
బీజేపీ జిల్లా కార్యాలయంలో నాడు ఎమర్జెన్సిలో పాల్గొన వారికి బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మానోత్శవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి వారికి శాలువాలతో ఘనంగా సన్మానం చేశారు..
అంతకు ముందు పెద్ద గడియారం దగ్గర నుండి బైక్ ర్యాలీతో స్వాగతం పలికి ర్యాలీ ద్వారా బీజేపీ జిల్లా కార్యాలయానికి వచ్చేసి కార్యాలయ ఆవరణలో మొక్కను నాటారు..
అనంతరం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గోని దేశ వ్యాప్తంగా కార్యకర్తల కృషి వలనే మూడు సార్లు కేంద్రంలో అధికారం చేపట్టమని అదే ఉత్సాహంతో పని చేసి స్తానిక సంస్థలలో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు..
ఈ కార్యక్రమంలో బిజెపి దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండేటి శ్రీధర్, బిజెపి కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, వీరెల్లి చంద్ర శేఖర్ , కనుమంత రెడ్డి శ్రీదేవి రెడ్డి,బీజేపీ రాష్ట్ర నాయకులు దాసరి మల్లేశం, బిజెపి దళిత మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చింత ముత్యాలరావు, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు రావేల కాశమ్మ,
బిజెపి నాయకులు లకడ పురం వెంకటేశ్వర్లు, బీజేపీ మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు గూగులోతూ తార, కూతురు విజయ,తదితరులు పాల్గొన్నారు..