–మునుగోడు నియోజకవర్గంలో తొలి ఆయిల్ ఫామ్ కోత
–మొదటి సారే 3 టన్నుల దిగుబడి
— జిల్లా ఉద్యానవన శాఖ అధికారి అనంతరెడ్డి
Farmer Income Stability : ప్రజాదీవెన నల్గొండ : ఆయిల్ ఫామ్ సాగుతో ప్రతి నెల పంట దిగుబడిని తీస్తూ ప్రభుత్వ ఉద్యోగి వలే నెలసరి ఆదాయం పొందవచ్చని జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమ జిల్లా అధికారి పిన్నపురెడ్డి అనంతరెడ్డి తెలిపారు. నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం లోని చండూరు మండలం కొండాపురం గ్రామానికి చెందిన ప్రస్తుత సూర్యాపేట జిల్లా ఎస్పీ కొత్తపల్లి నరసింహ కు చెందిన 8 ఎకరాల తోటలో ఆదివారం తొలి కోతను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఉద్యానవన శాఖ అధికారి అనంతరెడ్డి హాజరయ్యారు. ఆయిల్ ఫామ్ తోటలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఉద్యానవన శాఖ అధికారి మాట్లాడుతూ.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఉద్యాన శాఖ నల్లగొండ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ మొక్కలను నాటించడం జరిగిందని, కాగా నేటికీ మూడు సంవత్సరాల వయస్సుతో మొదటి పంట ప్రారంభం అయిందని తెలిపారు. మొదటి కోతలోనే సుమారు 3 టన్నుల దిగుబడి వచ్చిందని పేర్కొన్నారు.
ఉద్యాన శాఖ అధికారుల సలహాలు, సూచనలు పాటిస్తూ మేలైన యాజమాన్య పద్ధతులు, డ్రిప్ ద్వారా నీటి యాజమాన్యం పాటించి, సేంద్రియ ఎరువుల వినియోగం ద్వారా మంచి దిగుబడులు వచ్చాయని తెలిపారు. దిగుబడి బాగా రావడంతో సూర్యాపేట జిల్లా ఎస్పీ కొత్తపల్లి నరసింహ సంతోషాన్ని వ్యక్తం చేసినట్లు తెలిపారు. నీటి వసతి కలిగిన రైతులు అందరు కూడా ఆయిల్ పామ్ సాగు చేపట్టినట్లయితే మంచి లాభాలు పొందవచ్చని, ఎటువంటి మార్కెటింగ్ సమస్య ఎదుర్కోవల్సిన అవసరం ఉండదని అన్నారు. ప్రతి నెల పంట దిగుబడిని తీస్తూ ప్రభుత్వ ఉద్యోగి వలే నెలసరి ఆదాయం పొందవచ్చు అని సూచించారు.
ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా ఎస్పీ కొత్తపల్లి నరసింహ, మునుగోడు నియోజకవర్గ, ఉద్యాన, పట్టుపరిశ్రమ అధికారి రావుల విద్యాసాగర్, పతంజలి కంపెనీ ఫీల్డ్ ఆఫీసర్ శ్రీను, పతంజలి కంపెనీ చండూర్ ఫీల్డ్ అసిస్టెంట్ మోహన్, రైతులు, శంకరమ్మ, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.