Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Accident : గ్రానైట్ లారీ బోల్తా, రాళ్ళ కిందపడి ఇరువురి దుర్మరణం

Accident : ప్రజా దీవెన, ఖ‌మ్మంః ఖమ్మం జిల్లా ముదిగొండ మండల కేంద్రం సమీ పంలో జ‌రిగిన‌ రోడ్డు ప్రమాదంలో ఇరువురు దుర్మరణం పాలు కాగా ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. శుక్రవారం ముదిగొండ వద్ద మూల మలుపు వద్ద వేగంగా వెళుతున్న గ్రానైట్ ఆటో ట్రాలీ అదుపుతప్పి ఒక్క సారిగా బోల్తా పడటంతో అందులో ప్రయాణం చేస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృ తి చెందారు. గాయపడిన ఎనమిది మందిని స్థానికులు ఖమ్మం ఆసు పత్రికి తరలించారు.

 

ఖమ్మం నుంచి ఆటో ట్రాలీలో గ్రానైట్ రాళ్ళు తీసు కుని వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ట్రాలీ మీద ప్రయాణం చేస్తున్న వారిపై గ్రానైట్ బండలు పడటంతో ఇద్దరు మృతి చెందగా మరో ఎనిమిది మందికి తీవ్ర గా యాలపాలయ్యారు. సమాచారం అందుకున్న ముదిగొండ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తు న్నారు. మృతులు ఖమ్మం సమీ పంలోని ఖానాపురం హవేలీకి సం బంధించిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు.