Accident : ప్రజా దీవెన సిద్దిపేట: సిద్దిపేట జిల్లా లో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ రింగ్ రోడ్డు వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు.
ప్రజ్ఞాపూర్ రింగ్ రోడ్డు సమీపంలోని రాజీవ్ రాహదారిపై కారు ముందు వెళుతున్న లారీని ఢీకొట్టింది.దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అ క్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు పో లీసులు తెలిపారు.ఇద్దరు తీవ్రంగా గాయ పడటంతో వారిని సమీపం లోని ఆసుపత్రికి తరలించారు. కా గా మృతులు గోదావరిఖనికి చెం దిన వారుగా పోలీసులు గుర్తించా రు.లింగం (48) ప్రణయ్ (24) గా గుర్తించారు.
గోదావరిఖని నుండి హైదరాబాద్ కు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగమే ప్రమాదానికి గల కారణ మని తెలుస్తోంది. వేగంగా వచ్చిన కారు లారీని ఢీకొట్టడం వల్ల ముం దు సీట్లో ఉన్న ఇద్దరు స్పాట్ లోనే మరణించారని పోలీసులు తెలి పారు. సమాచారం తెలిసిన పోలీ సులు సంఘటన స్థలానికి చేరుకు ని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.