Agricultural Labor Union: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: గ్రామీణ పేదలకు ఉపాధి అవకాశాలు పెంచడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం (Agricultural Labor Union)మహిళా కూలీల జిల్లా కన్వీనర్ దండెంపల్లి సరోజ డిమాండ్ చేశారు. బుధవారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలు పుమేరకు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయతర కార్మికుల ఉపాధి అవకాశాలపై నల్లగొండ మండలం జి చెన్నారం గ్రామంలో సర్వే (survey) నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సరోజా మాట్లాడుతూ వ్యవసాయంలో యంత్రాలు వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలకు పనిరోజులు తగ్గాయని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయతర శ్రామికుల సంఖ్య (Number of workers)రోజురోజుకు పెరుగుతుందని అన్నారు. కనీస వేతనాలు ఇతర సౌకర్యాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి గ్రామీణ పేదలకు ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని వారు అన్నారు. పెరుగుతున్న నిత్యవసర వస్తువుల (Necessary goods) ధరలకు అనుగుణంగా కూలి రేట్లు పెరగాల్సి ఉందని అన్నారు. ప్రతి రెండు సంవత్సరాలకోసారి కనీస వేతనాల చట్టాన్ని సవరించాల్సి ఉన్న గత ప్రభుత్వం సవరించలేదని ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt)కనీస వేతనాల చట్టాన్ని సవరించి రోజు కూలి ఎనిమిది వందలు ఉండే విధంగా నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకానికి బడ్జెట్లో నిధులు పెంచి 200 రోజులు పని దినాలు పెంచాలని కోరారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నలగొండ మండల అధ్యక్షులు కట్ట అంజయ్య, సభ్యులు శోభారాణి, వెంకటమ్మ, యాదమ్మ , మారెమ్మ , ప్రేమలత, శంకరమ్మ, తదితరులు పాల్గొన్నారు