Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Air India Crash: విమాన తోక భాగంలో మరో మృతదేహం గుర్తింపు

ప్రజా దీవెన, అహ్మదాబాద్:
Air India Crash: ఎయిరిండియా విమానం కుప్పకూలిన ఘటనలో మరో మృతదేహం లభ్య మైంది. ప్రమాదానికి గల కారణా లను అన్వేషించేందుకు శనివారం ఉదయం శిథిలాలను తొలగిస్తుండ గా విమానం తోక భాగంలో ఈ మృతదేహాన్ని గుర్తించారు. విమానం చాలా వరకు మంటల్లో కాలిపోగా, తోక భాగం మాత్రం ఒక భవనంపై ఇరు క్కుపోయింది. తోక భాగాన్ని తొలగిస్తుండగా లభ్యమైన మృతదేహం విమాన సిబ్బందిలోని ఎయిర్‌ హోస్టెస్‌దిగా అధికారులు ధృవీకరించారు.

*ముగిసిన ప్రేమ, మిగిలిన రోధన*

అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో తన ప్రియురాలిని కోల్పోయిన యువకుడు వెంటనే ముంబై నుంచి అహ్మదాబాద్‌కి చేరుకొని ప్రియురాలి డెడ్ బాడీ కోసం వెయిటింగ్ రూమ్‌లో రోదిస్తూ కూర్చున్న యువకున్ని చూసిన వారిని కదిలిచివేసింది. ఎవరి కోసం ఇక్కడికి వచ్చావని వీడియో రికార్డ్ చేస్తున్న వాళ్లు అడిగితే కోసమంటూ భారమైన మనసుతో సమాధానం ఇచ్చాడు సదరు ప్రేమికుడు. తన ప్రియురాలు ఎప్పటికీ తిరిగిరాదనే బాధలో కన్నీంటిపర్యంతమయ్యాడు.