Akhanda 2 : ప్రజా దీవెన, హైదరాబాద్: అఖండ 2 తాండవం బ్లాక్ బస్టర్ చిత్రం అఖండకు అత్యంత అంచ నాలున్న సీక్వెల్. ఈ సినిమా తారా గణానికి కొత్త చేరికను పొందింది. మాస్ గాడ్ నందమూరి బాలకృష్ణ సరసన ఈ సినిమాలో హీరోయిన్ గా టాలెంటెడ్ నటి సంయుక్త నటి స్తుంది. ఇప్పటికే మేకర్స్ కిక్ షూట్ ప్రారంభించి, ఐకానిక్ మహా కుంభ మేలా వద్ద కొన్ని సన్నివేశాలను షూట్ చేసారు. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సిని మాలో విలన్ గా నటించేందుకు స్టార్ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ లాక్ అయ్యినట్లు ఫిలిం సర్కి ల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. రానున్న రోజులలో చిత్ర బృందం ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటించనున్నారు.
ఈ చిత్రంలో సంగీత సంచలనం ఎస్ థమన్, సినిమాటోగ్రాఫర్ సి రాంప్రసాద్, ఎడిటర్ తమ్మిరాజు మరియు ఆర్ట్ డైరెక్టర్ ఏ ఎస్ ప్రకాష్ సహా ప్రతి భావంతులైన సాంకేతిక సిబ్బంది ఉన్నారు. అఖండ 2: తాండవం బాలకృష్ణ, బోయపాటి శ్రీను ఇద్దరి కీ పాన్ ఇండియా అరంగేట్రం చేస్తూ భారతదేశం అంతటా విడుదల కా నుంది. ఈ చిత్రం దసరాకు సెప్టెంబ ర్ 25, 2025న థియేటర్లలోకి రా నుంది. నందమూరి తేజస్విని సమ ర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రా నికి థమన్ సంగీతం అందిస్తున్నా రు.