Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Alakananda hospital : కిడ్నీ రాకెట్ ముఠా గుట్టురట్టు, అలకానంద హాస్పటల్ సీజ్..?

Alakananda hospital : ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో కిడ్నీ రాకెట్‌ కలకలం రేపిన విష యం విధితమే. రాచకొండ కమిష నరేట్‌ పరిధిలో సరూర్‌నగర్‌లోని అలకనంద ప్రైవేట్‌ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడులు జరుగుతున్నట్టు పోలీసులకు ఫిర్యాదు రావడంతో వారు వైద్య ఆరోగ్య శాఖ అధికారు లతో కలిసి రంగంలోకి దిగడంతో గుట్టు రట్టయింది. గుట్టు చప్పుడు కాకుండా ఎప్పటి నుంచో ఈ వ్యవహారం కొనసాగుతోంది. ఎంత మందికి కిడ్నీ మార్పిడి చేశారనే కోణాల్లో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. హైదరాబాద్‌లో కిడ్నీ మార్పిడులు చేస్తున్న ఆసుపత్రిపై పోలీసులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహిం చారు. సరూర్‌నగర్‌లోని అలక నంద ఆసుపత్రిలో కిడ్నీ శస్త్ర చికి త్సలు జరుగుతున్నట్టు పోలీసుల కు ఫిర్యాదు రావడంతో వారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఆసుపత్రి లోపల నలుగురిని గుర్తించిన పోలీ సులు వారికి కిడ్నీ శస్త్ర చికిత్స జరి గినట్టు పోలీసులు గుర్తించారు.

 

వారిలో ఇద్దరు దాతలుగా భావిస్తు న్నారు. మరో ఇద్దరు గ్రహీతలుగా భావిస్తున్నారు. వీరు కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వారుగా గుర్తించారు. వీరు ఈ నెల 17 న ఆసుపత్రిలో చేరినట్టు అధి కారులు తెలిపారు. వారిని ప్రశ్నిం చగా తాము కిడ్నీలో రాళ్లు తీసు కోవడానికి వచ్చినట్టు తెలిపారు. కానీ అధికారుల పరిశీలనలో మాత్రం వారికి కిడ్నీ శస్త్ర చికిత్సలు జరిగినట్టు అనుమానాలు వ్యక్తమ య్యాయి. నలుగురికి కిడ్నీ మార్పి డి జరిగిందా అనే విషయాన్ని శాస్త్రీయంగా నిర్దారించేందుకు గాంధీ ఆసుపత్రికి తరలించారు.

అలకనంద ఆసుపత్రి గత ఆరు నెలల కింద ప్రారంభమైంది. ఈ ఆసుపత్రిలో చిన్నపాటి వైద్య చికిత్సలకు మాత్రమే అనుమతి ఉండగా ఇది తొమ్మిది పడకల ఆసుపత్రిగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. అయితే ఇక్కడ కిడ్నీ శస్త్ర చికిత్సలు వంటి వాటికి అనుమతి లేదని గుర్తించా రు. అయినప్పటికీ అక్రమంగా డ బ్బు ఆశ చూసి పక్క రాష్ట్రాలకు చెందిన వారికి అక్రమంగా శస్త్ర చికి త్సలు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఆసుపత్రిని అధికారులు సీజ్‌ చేశారు. ఈ వ్యవ హారంలో ఆసుపత్రి ఇన్‌చార్జితో పాటు మరొకొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న ట్టు సమాచారం. ఆసుపత్రిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయానికి వచ్చారు.