— నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
Bhavitha centres : ప్రజా దీవెన, కనగల్ : ప్రత్యేక అవ సరాలు కలిగిన విద్యార్థులకు భ విత కేంద్రాలలో అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శుక్రవారం ఆమె నల్గొండ జిల్లా,కనగల్ మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక పాఠశా లను సందర్శించి పక్కనే ఉన్న గదిలో భవిత కేంద్రం ఏర్పాటుకు పరిశీలించారు.అవసరమైతే అద నపు గదిని నిర్మించాలని,ఈ కేం ద్రంలో ఫ్రెండ్లీ టాయిలెట్, ర్యాంప్, రైలింగ్,తాగునీరు,వినియోగించుకొనే నీరు,ఫర్నిచర్,కృత్యాధార పద్ద తి పై విద్యార్థులకు నేర్పించేందుకు ప్రణాళిక తో సహా అన్ని సదు పాయాలు ఉండాలన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ మండ లంలోని రామచంద్రాపురంలో ఏ ర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు.ప్రతి రోజు 3 లారీలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు వేగవంతం చేసి పూర్తి చేయాలన్నారు.కాగా ప్రస్తుతం కేంద్రంలో 2 లారీలు పనిచేస్తు న్నాయి. కేంద్రానికొచ్చిన ధాన్యంలో తాలు,తరుగును గమనించిన జి ల్లా కలెక్టర్ నాణ్యతా ప్రమాణా ల తో ధాన్యాన్ని తీసుకు రావాలని రైతులతో ,తద్వారా మద్దతు ధర పొందవచ్చని తెలిపారు. తాలు, త రుగును తొలగించేందుకు తూర్పా రబట్టే యంత్రాలు ఇవ్వడం జరిగిం దని,వాటిని వాడుకోవాలన్నారు.
నల్గొండ ఆర్ డి ఓ వై.అశోక్ రెడ్డి, జిల్లా పౌర సరఫరాల మేనేజర్ హ రీష్,డి ఎస్ ఓ వెంకటేశ్వర్లు,డి ఈ ఓ బిక్షపతి తదితరులు ఉన్నారు.