Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Allam Narayana: సమస్యల పరిష్కారానికి సమరశీల పోరాటాలు

ప్రజా దీవెన, ఆసిఫాబాద్: సమస్య ల పరి ష్కారం కోసం మరో సమరశీ ల ఉద్యమానికి జర్నలిస్టులంతా సిద్ధం కావాలని ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్, టీయూడబ్ల్యూ హెచ్-143 రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయ ణ పిలుపునిచ్చారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం తెలంగా ణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్న లిస్టుల సభ్యత్వ నమోదు కార్యక్ర మం నిర్వహించారు. ఆయన ము ఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఎక్కడా లేని విధంగా జర్నలిస్టుల సం క్షేమం కోసం రూ.10 కోట్లతో కార్పరస్ ఫండ్ ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. పనిచేసే ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డు అందించడమే లక్ష్యంగా చర్యలు తీసుకున్నామ న్నారు. అనంతరం టీయూడబ్ల్యూ హెచ్-143 సభ్యత్వ కార్యక్రమాన్ని నిర్వహించి, పలువురు జర్నలి స్టులకు సభ్యత్వాన్ని అందజేశారు.

యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యద ర్శి ఆస్కాని మారుతి సాగర్, రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా కన్వీ నర్ దాసరి ఉమేశ్, కో-కన్వీన ర్లు రేణికుంట్ల శ్రీనివాస్, చెట్ల రమే శ్, సీనియర్ జర్నలిస్ట్ మునీర్, నగే శ్, జిల్లా కన్వీనర్ రవి నాయక్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాడి హనుమయ్య, యోగానంద స్వా మి, యూనియన్ నాయకులు దీకొండ సతీశ్, మసాడే సంతోష్, చిప్ప సురేశ్, రాజ్ కుమార్, ఖలీల్, తుకారం, రామస్వామి పాల్గొన్నా రు.