Ambedkar Jayanti :
ప్రజా దీవెన, హైదరాబాద్ : ఎస్సీ వర్గీకరణ అమలు చేయడమే అం బేద్కర్ కు అసలైన ఘననివాళి అ ని సీఎం రేవంత్ పేర్కొన్నారు. భార తరత్న డాక్టర్ బి.ఆర్. అం బేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వద్ద ఆయన వి గ్రహానికి సీఎం రేవంత్ రెడ్డి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పిం చారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వెంట ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దా మోదర రాజనర్సింహ, పొన్నం ప్ర భాకర్, ఎంపీ అనిల్ కుమార్ యా దవ్, పలువురు నేతలు పాల్గొని బాబాసాహెబ్ సామాజిక సమాన త్వ సందేశాన్ని స్మరించుకుంటూ శ్ర ద్ధాంజలి ఘటించారు.
అంబేద్కర్ ఆశయాల కోసం ప్ర జాప్రభుత్వం అడుగులు…
అదే విధంగా అంబేద్కర్ జయంతి సం దర్భంగా సీఎం రేవంత్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రజాప్రభు త్వం అడుగులు వేస్తుందన్నారు. ఎస్సీ వర్గీ కరణతో 3 దశాబ్దాల పోరాట ఆకాంక్షలు నెరవేర్చడమ న్నారు. యంగ్ ఇండియా ఇంటి గ్రేటెడ్ స్కూళ్లతో నాణ్యమైన విద్య అందుతుందన్నారు. రైతుకు, రైతు కూలీలకు ఎకరాకు రూ.12 వేల ఆర్థిక భరోసా సన్నబియ్యం, ఇందిర మ్మ ఇళ్ల పథకం, భూభారతికి శ్రీకా రం చుట్టడం ఆ మహనీయుడికి ఘన నివాళి అని ఎక్స్లో సీఎం రేవంత్రెడ్డి తెలిపారు.