Ambedkar Jayanti : ప్రజా దీవెన,నల్గొండ : ప్రపంచ మేధావి, నవ భారత నిర్మాత, రాజ్యాంగ పితామహుడు, అంటరానితనం కుల వివక్షత పై అలుపెరుగని పోరాటం చేసిన పోరాట యోధుడు,స్వేచ్చ, సమాన త్వం, సౌబ్రాతృత్వం, సామజిక న్యాయం అందించిన సామాజిక వేత్త, పీడిత, తాడిత ప్రజలకు హ క్కులను కల్పించిన హక్కుల నేత, బడుగు బలహీన వర్గాలకు, హరిజ న గిరిజన, మైనారిటీ ప్రజలకు రిజ ర్వేషన్లు కల్పించిన రిజర్వేషన్ల ప్రదాత, ఓటు హక్కు ప్రధాత, మహిళా హక్కులనేత,కార్మికులకు పని దినాలు తక్కువ కల్పించిన కార్మిక నేత, మానవ హక్కుల పరిరక్షకుడు ఆర్థికవేత్త, 21 వ శతాబ్దపు జ్ఞాని, సామాజిక శాస్త్రవేత్త, న్యాయ కోవిధుడు, అస్పృశ్యత నివారణోద్యమకా రుడు, భారత స్వాతంత్రోద్య మంలో పాత్ర వహించిన మహాను భావుడు, పలు గ్రంథాల రచయి త, దేశ విదేశాలలో, విశ్వవిద్యాల యాల్లో డాక్టరేట్ పొందిన విద్యా వంతుడు, బ్రిటిష్ వారు ఏర్పాటు చేసిన పలు కమిటీలలో సభ్యుడు, భారత దేశ తొలి న్యాయ శాఖ మంత్రి, వైస్రాయ్ కౌన్సిల్లో ప్రధమ కార్మిక మంత్రి, రాజ్యాంగ సభ్యు లు,రాజ్యాంగ కమిటీ చైర్మన్, రాజ్యాంగ రచయిత, భారత రత్న పురస్కార గ్రహీత, సంపాదకులు, ప్రాథమిక హక్కులను, ప్రాథమిక విధులను, ఆదేశిక సూత్రాలను ప్రజలకు అందించిన మహోన్నత వ్యక్తి, సాంఘిక,ఆర్థిక రాజకీయ, అస సమానతలపై పోరాటం చేసిన పోరాటయోధుడు, రిజర్వ్ బ్యాంక్ చట్టం, భారత చట్టం , హిందూ బిల్లు కోడ్ ప్రధాత డాక్టర్ భీమ్ రావ్ రాంజీ అంబేద్కర్ 135వ జయంతి సందర్బంగా ఆ మహనీయునికి నివాళులు అర్పిస్తూ, అయన ఆశయ సాధనాలను తర తరాలకు అందిద్దాము.
అంబేద్కర్ బాల్యం -విద్యాభ్యాసం
బాబా సాహెబ్ భీమ్ రావ్ రాంజీ అంబేద్కర్ మధ్యప్రదేశ్ లోని మోవ్ గ్రామంలో దళిత మహర్ కుటుంబంలో రాంజీ మాలోజి సక్పాల్, బీమా భాయ్ సక్ పాల్ దంపకతులకు 14 వ సంతానంగా బీ ఆర్ అంబేద్కర్
1891 ఏప్రిల్ 14 వ తేదిన
జన్మించారు.
ప్రాథమిక విద్య మొత్తం మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా సతారీ గ్రామంలో పూర్తి చేశారు. ఉన్నత విద్య కోసం ముంబై వెళ్లారు. యూనివర్సిటీ విద్య కోసం, లండన్,అమెరికా వంటి దేశాలకు వెళ్లారు. ఎన్నో డాక్టరేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేషన్లు, డిగ్రీ పట్టాలు సాధించారు.
అంబేద్కర్ ఆర్థిక శాస్త్రము, న్యాయ శాస్త్రము, రాజనీతి శాస్త్రం వంటి వివిధ రంగాలలో లోతైన పరిజ్ఞానాన్ని సంపాదించారు.
అంబేద్కర్ రచించిన గ్రంధాలు
అంబేద్కర్ అనేక గ్రంథాలను రచించి జ్ఞాన సంపత్తిని ప్రపంచానికి దేశానికి అందించారు.
ద ప్రాబ్లం ఆఫ్ ద రూపీ, ది అన్హిలేషన్ ఆఫ్ కాస్ట్, హూ ఫర్ ద శూద్రాస్, పాకిస్తాన్ ఆర్ ది పార్టిషన్ ఆఫ్ ఇండియా, థాట్స్ ఇన్ లింగ్విస్టిక్ స్టేట్స్, రాడికల్స్ ఇన్ హిందూ యిజం, బుద్ధ కార్లు మార్కిజం, వెయిటింగ్ ఫర్ ఏ వీసా, స్టేట్స్ అండ్ మైనారిటీస్, వంటి గ్రంథాలను రచించారు. అంబేద్కర్ ప్రారంభించినపత్రికలు
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అనేక పత్రికలు ప్రారంభించి వాటి ద్వారా తన సామాజిక, ఆర్థిక, రాజకీయ భావాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు.
మూక్ నాయక్, బహిష్కృత భారత్, జనతా, సమత వంటి పత్రికలు స్థాపించి అణగారిన వర్గాల వారి హక్కుల కోసం, సామాజిక న్యాయం, సమానత్వం కోసం, అంటరానితనం, కుల వివక్షత పై పోరాడారు.
అంబేద్కర్ ఉద్యమాలు
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సామాజిక సమానత్వం కోసం అనేక ఉద్యమాలు చేశారు.
మహాడ్ సత్యాగ్రహం మహారాష్ట్రలో దళితుల హక్కుల కోసం జరిగింది. చావధారు చెరువులోని నీటిని దళితులు ఉపయోగించుకునే హక్కు కోసం అంబేద్కర్ ఈ ఉద్యమం నడిపించారు.
ఆలయ ప్రవేశ ఉద్యమం ముఖ్యంగా దళితులందరూ దేవాలయాల్లోకి ప్రవేశించాలని ప్రారంభించారు.
పూనా ఒప్పందం
పూనా ఒప్పందంలో ముఖ్యంగా అంబేద్కర్ దళితులకు ప్రత్యేక నియోజకవర్గాల ఏర్పాటు కోసం పోరాడారు.
* రౌండ్ టేబుల్ సమావేశాల్లో అంబేద్కర్ పాత్ర
అంబేద్కర్ ముఖ్యంగా మూడు రౌండ్ టేబుల్ సమావేశాలకు భారతదేశంలోని దళితుల, అగారిన వర్గాల పక్షాన హాజరయ్యి దళితులు ఎదుర్కొంటున్న సాంఘిక రాజకీయ అన్యాయాలను వివరించారు. దళితుల కోసం ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలని అంబేద్కర్ ప్రధానంగా డిమాండ్ చేశారు.
* *ఆర్థిక అభివృద్ధిలో అంబేద్కర్ పాత్ర
భారతదేశ ఆర్థిక అభివృద్ధిలో అంబేద్కర్ కీలక భూమిక పోషించారు రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా చట్టాన్ని తీసుకొచ్చి రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా ఏర్పాటులో విశేష కృషిని అందించి ఆర్ధిక ద్రవ్య విధానం పై అధ్యయనం చేశారు.
రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా కృషి స్థాపనలో ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం ఆర్బిఐ తన 81వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన పేరు మీద నాణాలు కూడా విడుదల చేశారు.
అంబేద్కర్ స్థాపించిన రాజకీయ పార్టీలు
అంబేద్కర్ సామాజిక సమానత్వం కోసం అనేక రాజకీయ పార్టీలను స్థాపించారు. స్వతంత్ర కార్మిక పార్టీ, క్యాస్ట్ ఫెడరేషన్, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా. వైశ్రాయ్ కౌన్సిల్ మొదటి కార్మిక మంత్రిగా పనిచేశారు.
ఓటు హక్కు, విద్యా హక్కు రూప కర్త
రాజ్యాధికారం ద్వారానే ఏదైనా మనం సాధించవచ్చు అని 18 సంవత్సరాలు నిండిన వయోజనులకు ఓటు హక్కు కల్పించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో ముఖ్య భూమిక పోషించారు.
విద్య ద్వారానే మన తలరాతను మార్చవచుకోవచ్చు అని విద్యా హక్కును ప్రవేశపెట్టాడు.
మనుధర్మాన్ని మంటగలిపి బుద్ధిజం వైపు మళ్ళీ శాంతి, అహింస మార్గాలను భావితరాలకు అందించారు.
నీకోసం జీవిస్తే నీలోనే చస్తావు, పదిమంది కోసం జీవిస్తే జనంలో నిలుస్తాం చాటి చెప్పిన మహానేత.
మేకలమై బలై పోదామా.., ఎదురు తిరిగి సింహాలై గర్జిద్దాము. అని చెప్పిన మహనీయులు.
ప్రపంచ స్థాయిలో అంబేద్కర్ ప్రజల హక్కుల కోసం, కార్మికుల కోసం కృషి చేశారు. ఇంటర్ నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్(ఐ ఎల్ ఓ), ట్రేడ్ యూనియన్ అక్ట్,ఈ ఎస్ ఐ అక్ట్, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ తీసుకొచ్చిన కార్మిక నేత.
ఈ రోజు ప్రపంచం మొత్తం, దేశం మొత్తం స్మరించుకుంటున్నారంటే ప్రపంచానికి అందించిన జ్ఞానం, దేశానికి చేసిన సేవ చెప్పవచ్చు. అతని జ్ఞానాన్ని గుర్తించిన ఐక్యరాజ్యసమితి అతని జయంతి సందర్భంగా వరల్డ్ నాలెడ్జ్ డే గా, జ్ఞాన దివస్, ప్రపంచ జ్ఞాన దినోత్సవంగా వేడుకలు జరుపుకుంటున్నాయి.
ప్రపంచ మానవాళి, భారతదేశ ప్రజలు అతని జయంతిని ఘనంగా నిర్వహిస్తు న్నారు అంటే.,ఆయన జీవితం నేటికీ నాటికి, ఎల్లప్పటికీ మానవ సమాజానికి, ఆదర్శం స్ఫూర్తి దాయకం… జై భీమ్.
వీరబోయిన రామాంజనేయులు యాదవ్
సీనియర్ జర్నలిస్ట్ & అడ్వకేట్
నల్గొండ