Anjaneya Goud: ప్రజా దీవెన, గద్వాల: రాబోవు రోజులు బీఆర్ఎస్ (brs) వేనని కార్య కర్తలు దైర్యంగా ఉండాలని బీఆ ర్ఎస్ కార్యకర్తలకు జిల్లా సమన్వయ కర్త శాట్స్ మాజీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ (Anjaneya Goud) భరోసా ఇచ్చారు. బీఅర్ఎస్ వర్కింగ్ ప్రెసి డెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు గురువారం కేటిదొడ్డి, ధరూర్ మండల కేంద్రాలలో ఆత్మీయ సమావేశాలు (Intimate meetings) నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నడిగడ్డలో బీఆర్ఎస్ ప్రభంజనాన్ని (BRS boom) ఎవ్వరూ అడ్డుకో లేరన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హమీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు హన్మంతు నాయుడు, సీనియర్ నాయకుడు నాగర్ దొడ్డి వెంకట్ రాములు, అంగడి బస్వరాజు,టీఆర్ఎస్ వెంకటేష్, టవర్ మగ్బుల్, నూర్ పాష,బీఅర్ఏస్వీ జిల్లా నాయకుడు కుర్వ పల్లయ్య, బీఅర్ఏస్ సీనియర్ యువజన నాయకులు, మోనేష్, మందా మల్లి, పవన్ సాగర్, బొమ్మల రామకృష్ణ, బొప్పల శ్రీ నివాసులు, మోహన్ గౌడ్, తదితర నాయకులు పాల్గొన్నారు.