Annual Budget : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ రాష్ట్ర 2025-26 ఆర్థిక సంవ త్సరానికి గాను వార్షిక బడ్జె ట్ను ప్రజా ప్రభుత్వం శాసనసభలో ప్రవే శపెట్టింది. ముఖ్యమంత్రి ఎ.రే వం త్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మం త్రి మండలి సమావేశం వార్షిక బడ్జె ట్ కు ఆమోదముద్ర వేసింది. అనం తరం ఉప ముఖ్యమంత్రి తొలుత బడ్జెట్ ప్రతులను లాంఛనంగా ము ఖ్యమంత్రికి అందజేశారు.ఆ తర్వా త ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క బడ్జె ట్ను శాసనసభలో, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖ మం త్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శాసనమం డలిలో ప్రవేశపెట్టారు.
2025-26 ఆర్థిక సంవత్సరానికి మొత్తం రూ. 3,04,965 కోట్ల వ్యయంతో బడ్జెట్ ప్రతిపాదించారు. బడ్జెట్ సభలో ప్రవేశపెట్టిన సందర్భంగా ముఖ్య మంత్రి, మంత్రులు, ఇతర ప్రజా ప్ర తినిధులు ఉప ముఖ్యమంత్రిని అభినందించారు.ఇది అభివృద్ధి, సంక్షేమం పట్ల నిబద్ధతతో కూడిన ప్రజాబడ్జెట్గా పేర్కొంటూ ఈ సంద ర్బంగా ముఖ్యమంత్రి ప్రజలకు అభి నందనలు తెలియజేశారు. ఉన్నత మైన లక్ష్యాలను నిర్ధేశించుకుంటూ సుసంపన్నత, సమగ్రత, మరియు స్థిరమైన అభివృద్ధితో కూడిన తె లంగాణను నిర్మిస్తామని 72 పేజీల బడ్జెట్ ప్రసంగంలో ఉప ముఖ్య మంత్రి పేర్కొన్నారు. గడిచిన 15 నెలల పాలనలో ప్రధానంగా సంక్షే మ రంగంలో తీసుకున్న చర్యలను సమగ్రంగా వివరిస్తూ భవిష్యత్తు ప్రణాళికను బడ్జెట్లో ఆవిష్క రించారు.