Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

APGVB: నూతన సంవత్సరం 20 25 నుండి ఏపీజీవీబీ బ్యాంక్ తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా మారుతుంది

ఖాతాదారులు గమనించాలి
ఈనెల 28 నుండి సేవలకు అంతరాయం
బ్యాంకు మేనేజర్ మహాలక్ష్మి

ప్రజా దీవెనతో వెల్లడి

మునుగోడు ప్రజా దీవెన డిసెంబర్ 27 నూతన సంవత్సరం జనవరి ఒకటి 20 25 నుండి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా మారుతుందని నాంపల్లి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ మహాలక్ష్మి తెలిపారు గురువారం రోజున ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఈనెల 28 నుండి 31 వరకు బ్యాంకు సేవలు బ్యాంకింగ్ యు పి ఎల్ ఏటీఎం మొబైల్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండవని తాత్కాలికంగా అంతరాయం కలుగుతుందని ఖాతాదారులు గమనించాలని కోరారు.

ఈనెల 27 వరకు బ్యాంకు పనులు పూర్తి చేసుకోవాలని అన్నారు ఏపీజీవీబీ నుండి టీజీబీగా అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలన్నారు భారత ప్రభుత్వ ఆర్థిక సేవల విభాగాల నుండి డి ఎఫ్ ఎస్ వారి ఆదేశానుసారం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితం అవుతుందని ఏపీజీబీవీ శాఖలు తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనం చేయబడి తమ కార్యకలాపాలను కొనసాగిస్తాయని మేనేజర్ మహాలక్ష్మి వివరించారు ఖాతాదారులు గమనించి బ్యాంక్ సేవలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో బ్యాంకు సిబ్బంది ఫీల్డ్ ఆఫీసర్ బాలకృష్ణ , అనిల్ కుమార్ క్యాషియర్ అనిల్ కుమార్ , అనుమిదు బ్యాంకు మిత్రలు కామిశెట్టి సైదమ్మ నేరెళ్ల సైదులు పాల్గొన్నారు