Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Uttam Kumar Reddy : 28 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేత…..

*రాష్ట్ర నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి

Uttam Kumar Reddy : ప్రజాదీవెన,  కారుణ్య నియామక పత్రాలు అందజేసిన రాష్ట్ర నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఆదివారం కోదాడ శాసనసభ్యుని క్యాంపు కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ తో కలిసి ఆరుగురు అభ్యర్థులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగం పొందిన వారికి నియామక పత్రాలు అందజేసిన మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ప్రభుత్వ విధులు నిర్వహిస్తూ చనిపోయిన కుటుంబాల వారికి రెవెన్యూ శాఖ నందు ఐదుగురు అభ్యర్థులకు వైద్య ఆరోగ్య శాఖ నందు ఒక అభ్యర్థికి ఈరోజు మంత్రి కారుణ్య నియామక పత్రాలు అందజేశారు.

 

అలాగే వైద్య ఆరోగ్యశాఖ నందు కాంట్రాక్టు పద్ధతిన మెరిట్ ఆధారంగా వివిధ పోస్టులలో 22 మంది అభ్యర్థులకు మంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విధుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని చిత్తశుద్ధితో పని చేయాలని మంత్రి పేర్కొన్నారు ఉద్యోగంలో నిజాయితీగా పనిచేయాలని ఉద్యోగము పొందిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో డిఎం అండ్ హెచ్ ఓ కోటాచలం వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు