Attack Couple : ప్రజా దీవెన, వరంగల్: సాక్షాత్తు పో లీస్ స్టేషన్ లోనే ప్రేమికుల కుటుం బ సభ్యుల పరస్పర దాడులతో గం దరగోళం నెలకొంది. అడ్డుకున్న పోలీసులపై పిడిగుద్దుల వర్షం కురి పించిన వైనo వరంగల్ జిల్లా లో చో టుచేసుకుంది. పోలీసులను ఆశ్ర యించిన ప్రేమ జంటపై అలాగే అ బ్బాయి బంధువులపై సుమారు 50మంది అమ్మాయి బంధువులు దాడికి దిగిన సంఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో బుధవారం జరిగిం ది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే…శాయంపేట మండలం ఆరేపల్లి గ్రామానికి చెంది న ఓ యువతి, యువకుడు వారం రోజుల క్రితం ప్రేమ వివాహం చేసు కున్నారు. అనంతరం నల్లబెల్లి మం డలం శనిగరం గ్రామానికి చెందిన అ బ్బాయి బంధువైన సముద్రాల బా లరాజు ఇంట్లో తలదాచుకున్నారు.
విషయం తెలుసుకున్న అమ్మాయి బంధువులు మంగళవారం సా యంత్రం రెండు వాహనాలలో సు మారు 20 మంది చేరుకొని బా లరాజు లేని సమయంలో అతని భార్యతో పాటు కుటుంబ సభ్యు లపై దాడికి పాల్పడ్డారు.
ప్రాణ రక్షణ కోసం ప్రేమ జంట నల్ల బెల్లి పోలీస్ స్టేషన్ను ఆశ్రయించా రు. దాడికి పాల్పడ్డ సంఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
సమాచారం అందుకున్న అమ్మాయి బంధువులు సుమారు 50 మంది ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ను చు ట్టుముట్టి పోలీసు రక్షణలో ఉన్న ప్రే మ జంటపై విచక్షణారహితంగా దా డికి పాల్పడ్డారు.అంతటితో ఆగకుం డా ప్రేమ జంటకు ఆశ్రయం కల్పిం చిన కుటుంబంపై సైతం పోలీస్ స్టే షన్లో ఏర్పాటుచేసిన పూల కుం డీలతో దాడికి పాల్పడ్డారు.
అదే క్రమంలో అడ్డుకున్న మహిళా కానిస్టేబుల్ స్వర్ణ, మరో కానిస్టేబు ల్ వేణుపై అమ్మాయి బంధువులు పిడి గుద్దులు గుద్దుతూ దాడికి పా ల్పడ్డారు.ఈ దాడిలో సముద్రాల స్వాతి అనే మహిళ తీవ్రంగా గా యపడడంతో పోలీసులు 108 వా హనంలో చికిత్స నిమిత్తం నర్సం పేట ఏరియా హాస్పిటల్కు తరలిం చారు. విషయం తెలుసుకున్న సీఐ సాయి రమణ హుటాహుటిన పో లీస్ స్టేషన్కు చేరుకొని విచారిస్తు న్నారు. మేరకు కేసు నమోదు చేసు కొని దర్యాప్తు జరుపుతున్నారు.
Relatives attacked on Lovers at warangal police station pic.twitter.com/jaOsYWBkw7
— praja deveena web site and digital edition e paper (@PDeveena40655) June 4, 2025