Awareness programme: ప్రజా దీవెన, కోదాడ : జిల్లాఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ ఆదేశాల మేరకు కోడాడ రూరల్ CI రజితా రెడ్డి (CI Rajitha Reddy)మండల పరిధిలోని గుడిబండ ప్రభుత్య పాఠశాలలో సైబర్ నేరాలపైన, గంజాయి, డ్రగ్స్ మత్తుమందులపై, పోలీసు కళాభృందం (Police Art Group) తో విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు CI రజితా రెడ్డి (CI Rajitha Reddy) మాట్లాడుతూ జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ అధ్వర్యంలో సైబర్ నేరాలపై, గంజాయి డ్రగ్స్ మత్తు మందులు, గుట్కాపై పటిష్టంగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రతి గ్రామంలో, స్కూల్లో కళాశాలలో చదువుకునే విద్యార్థులు, యువతి యువకులు ఇంటర్నెట్ ను సద్వినియోగం చేసుకోవాలి, సైబర్ మోసగాళ్ళ వల్ల మోసాలకు గురి కావద్దు, బ్యాంక్ ఖాతా,ATM కార్డ్ వివరాలు,OTPవివరాలు (Bank Account, ATM Card Details, OTP Details) ఇతరులకు తెలపవద్దు, ఇతరులు ఆశ చూపితే వాటికి ఆకర్షితులు కావొద్దు. మెసేజ్ లలో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దు అని కోరినారు సైబర్ మోసాలపై* 1930టోల్ ఫ్రీ నంబర్ కు పిర్యాదు చేయాలని అన్నారు. అలాగే వేధింపులపై100కు సమాచారం ఇవ్వాలని తెలిపినారు.
వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు, ఏటీఎం పిన్ నెంబర్లు, సోషల్ మీడియాలో బహిర్గతం చేయొద్దన్నారు. వ్యక్తిగత ఫోటోలను DP లుగా పెట్టుకోవద్దని చెప్పారు.మొబైల్ యాప్ లలో వచ్చేటువంటి అనవసరమైన బ్లూ లింకులను క్లిక్ చెయ్యొద్దు అని తెలిపారు. యువత చెడు వ్యసనాల బారిన పడొద్దు అన్నారు.గంజాయి మత్తుమందులకు సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిస్తే తప్పకుండా పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని తెలియజేశారు
SI అనిల్ రెడ్డి గారు మాట్లాడుతూ డ్రైవింగ్ లైసెన్స్ (Driving license)లేకుండా వాహనాన్ని నడపవద్దు ట్రాఫిక్ రూల్స్ ను* అతిక్రమించొద్దు అని అన్నారు.
యువత లోన్ యాప్ లకు దూరంగా ఉండాలన్నారు. సామాజిక మాధ్యమాలకు రక్షణగా బలమైన పాస్వర్డ్లు పెట్టుకోవాలని అన్నారు. అనంతరం పోలీసు కళబృందం వారు చక్కటి సాంస్కృతిక, పాటలతో విద్యార్ధిని విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమం నందు ప్రభుత్వ పాఠశాల ఇన్చార్జ్ హెడ్మాస్టర్ శ్రీనివాసరావు పోలీస్ సిబ్బంది కానిస్టేబుల్ వీరప్రసాద్,నరేష్ కళాబృందం ఇంచార్జ్ యల్లయ్య, గోపయ్య, గురులింగం, క్రిష్ణ,చారి, నాగర్జున మరియు విద్యార్థినీ విద్యార్థులు ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.*