Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Schools Opening: బందోబస్తుగా బడిబాట

తెలం గాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరిక క్రమంగా తగ్గుము ఖం పడుతున్న నేపథ్యంలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో బడిబాట కార్యక్రమాన్ని బందోబస్తుగా చేప ట్టేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.

విద్యార్థులను ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రణాళిక
జూన్‌ 1 నుంచి 11వ తేదీ వరకు బడిబాట ప్రారంభం
పగడ్బందిగా అమలు చేయాలని టీచర్లకు విద్యాశాఖ ఆదేశం
విద్యార్థుల చేరికలు గణనీయం గా పెంచాలని అదేశం
ప్రస్తుత ఏడాది రూ. 1,907 కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం
ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గుతున్న చేరికలు పెంచడమే లక్ష్యం

ప్రజా దీవెన, హైదరాబాద్‌: తెలం గాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరిక క్రమంగా తగ్గుము ఖం పడుతున్న నేపథ్యంలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో బడిబాట(badibata ) కార్యక్రమాన్ని బందోబస్తుగా చేప ట్టేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చేరికలు కొంత ఆశాజనకం గానే ఉన్నా ఆ తర్వాత తరగతుల్లో ఎన్‌రోల్‌మెంట్‌(Enrolment) పడిపోతుండడంతో ఆరో తరగతి నుంచి విద్యార్థులు ప్రైవేటు బాటపడుతున్నారు. దీంతో సరిదిద్దేందుకు అధికారులు కార్యాచరణ చేపట్టడం లేదనే విమర్శలు సర్వత్రా వెల్లువెత్తున్న క్రమంలో తాజాగా సమగ్ర శిక్ష ప్రాజెక్టు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది.

రాష్ట్రంలో ఎన్‌రోల్‌ మెంట్‌ పెంచాల్సిన అవసరం ఉంద ని సూచించింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని జూన్‌ 1 నుంచి 11 వరకు బడిబాట కార్యక్రమాన్ని అధికారు లు చేపట్టనున్నారు. ఏటా పాఠశా లలు తెరిచే ముందు ప్రభుత్వం ఈ ప్రక్రియ చేపట్టడం సాధరణమే అయినప్పటికీ ఈసారి విద్యార్థుల శాతాన్ని ఎక్కువగా పెంచాలని విద్యాశాఖకు స్పష్టమైన ఆదేశాలు అందాయి.ఈ ఏడాది రూ. 1,907 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక రచించింది. ఈ నిధులతో ఉచిత పాఠ్యపుస్తకాలు, యూని ఫాంలతో పాటు భవనాల మరమ్మ తులు, స్మార్ట్‌ క్లాస్‌రూంలు, ఇన్ఫ ర్మేషన్‌ టెక్నాలజీ, సిబ్బంది జీతాల కు ఖర్చు చేయనుంది. గతంలో మన ఊరు-మన బడి కార్యక్రమం కింద స్కూళ్లలో మౌలికవసతులు కల్పించాలని నిర్ణయించగా ప్రభు త్వం మారడంతో ఈ కార్యక్రమం నత్తనడకన నడుస్తోంది.

దీంతో పాటు టీచర్ల కొరత ప్రభుత్వ పాఠశా లలను(Shortage of teachers in government schools) వేధిస్తోంది. ప్రధా నంగా ఈ రెండు సమస్యలను పరిష్కరిస్తే తప్ప ప్రభుత్వ బడుల్లో ఎన్‌రోల్‌మెంట్‌ పెరిగే అవకాశం లేదని అధ్యాపక వర్గాలు అంటు న్నాయి. రాష్ట్రంలో 30,023 ప్రభు త్వ స్కూళ్లు ఉన్నాయి. వాటిలో 1,213 స్కూళ్లలో గతేడాది జీరో ఎన్‌రోల్‌మెంట్‌ నమోదైంది. 13,36 4 పాఠశాలల్లో ఎన్‌రోల్‌మెంట్‌ సంఖ్య 50లోపే ఉంది.రాష్ట్రంలో 21 వేల టీచర్‌ పోస్టుల ఖాళీలు న్నాయి. 5,821 స్కూళ్లు ఒకే టీచర్‌ తో నడుస్తున్నాయి. 80 శాతం స్కూళ్లలో సబ్జెక్టు లేదా భాషా పండితుల కొరత ఉంది. దివ్యాం గులకు టాయ్‌లెట్స్‌ లేని స్కూళ్లు 15.45 శాతం ఉన్నాయి.బాలికలకు టాయ్‌లెట్స్‌ (Toilets)లేని బడులు 9.44 శాతం ఉన్నాయి. 18, 19 పాఠ శాలల్లో సమీకృత సైన్స్‌ లేబొరేటరీ లు లేవు. ఐసీటీ ల్యాబ్‌ లు లేని స్కూళ్లు 11.7 శాతం. స్కిల్‌ ఎడ్యు కేషన్‌ ల్యాబ్‌లు లేని బడులు 71 శాతం ఉన్నాయి. ఎస్‌సీఈఆర్‌టీలో మంజూరైన పోస్టుల్లో 46.15 శాతం పోస్టులు, డైట్‌ కాలేజీల్లో 67.83 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా ఒకటి నుంచి పదో తరగతి వరకు 60 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్నారు. వారి లో 28 లక్షల మంది ప్రభుత్వ పాఠ శాలల్లో చదువుతుంటే మిగతా విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్నారు. కోవిడ్‌(covid)సమయం లో ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్‌రోల్‌ మెంట్‌ పెరిగింది. 2020 నుంచి 2022 వరకూ ఏటా 2.5 లక్షల మంది కొత్తగా ప్రభుత్వ బడుల్లో చేరారు. కానీ 2023 నుంచి మళ్లీ క్రమంగా ఏటా లక్ష మంది ప్రభుత్వ పాఠశాలల నుంచి నిష్క్రమిస్తున్నా రు.

రాష్ట్రంలోని స్కూళ్లలో విద్యా ర్థుల హాజరుపై సమగ్ర శిక్ష ప్రాజెక్టు ఇటీవల ఓ నివేదిక రూపొందిం చింది. దీని ప్రకారం 44 శాతం ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం 50 మంది విద్యార్థులు కూడా ఉండటం లేదు. ఐదో తరగతి వరకు ఒక్కో క్లాసులో 40 నుంచి 60 మంది విద్యార్థులు ఉన్నారు. ఆ తర్వాత నుంచి విద్యార్థుల చేరికలు క్లాసుకు 46 నుంచి 35కు పడిపోయాయి. ప్రభుత్వ పాఠశాలలు సక్రమంగా నడవకపోవడం, ఉపాధ్యాయుల కొరత, సకాలంలో పుస్తకాలు అందకపోవడం వల్ల బోధన కుంటుపడుతోంది.

దీంతో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తమ పిల్లలకు మెరుగైన విద్యను అందించాలనే ఉద్దేశంతో తల్లిదం డ్రులు పట్టణాలకు తరలుతున్నా యని నివేదిక పేర్కొంది. విస్తృత ప్రచారం కల్పించేలా ప్రభుత్వ పాఠ శాలల్లో సదుపాయాలు, ()నాణ్యతా ప్రమాణాలు పెంచుతున్న తీరుపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాల ని విద్యాశాఖ క్షేత్రస్థాయి టీచర్లకు సూచించింది. జూన్‌ ఒకటి నుంచి 11వ మధ్య చేపట్టే బడిబాట కార్య క్రమంలో స్కూళ్లను ఆదర్శ(Facilities and quality standards) పాఠశా ల కమిటీల ద్వారా తీర్చిదిద్దుతున్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాలని, ఉపాధ్యాయ నియామకాలు చేప డుతున్న తీరును ప్రజల్లోకి తీసు కెళ్లాలని పేర్కొంది.

 

badibata beginning in telangana