Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Bahujan Batukamma: వాడవాడల బహుజన బతుకమ్మ

–అరుణోదయ సాంస్కృతిక సమై క్య గౌరవ అధ్యక్షురాలు విమలక్క

Bahujan Batukamma: ప్రజా దీవెన, శాలిగౌరారం: సమా జంలో మహిళలపై పెరుగుతున్న అత్యాచారాలను నిరసిస్తూ స్త్రీలు గౌరవంగా జీవించే హక్కును చాటి చెప్పేందుకు ఊరురా వాడ వాడల బహుజన బతుకమ్మను (Bahujan Batukamma) నిర్వహిం చడం జరుగుతుందని అరుణోద య సంస్కృతిక సమాఖ్య గౌరవ అధ్యక్షురాలు విమలక్క అన్నారు. శాలిగౌరారం మండలం ఊట్కూర్ గ్రామంలోని శుక్రవారం రాత్రి బహు జన బతుకమ్మను ఏర్పాటు చేశా రు.తీరొక్క పూలను పేర్చి ఆడబి డ్డలంతా బతుకమ్మను ఆడారు.
బహుజన బతుకమ్మ అంటే పూల కవాతు,స్త్రీల కవాతు అంటూ చాటాల్సిన అవసరం ఉందన్నారు. అత్యాచారాలను ప్రతిఘటించడం, ఆత్మగౌరవంతో జీవించడం మహిళల హక్కు అని ప్రతి ఒక్కరూ చాటాలన్నారు.స్త్రీ,పురుషుల సమాన హక్కుల (Equal rights of men and women) కోసం ప్రతి ఒక్కరు పోరాటం చేయాలన్నారు .

సమాజం యొక్క అభివృద్ధికి స్త్రీలు స్థితిగతులే కోలమానమని సామాజిక విప్లవకారులు (Social revolutionaries)డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారని, దేశ విదేశీ సర్వేలు పలు పరిశోధనలు భారత స్త్రీల పరిస్థితిని వెనుకబాటుతనాన్ని ఎత్తి చూపుతున్నాయన్నారు. ప్రత్యేకించి దళిత స్త్రీలపై జరుగుతున్న లైంగిక అత్యాచారాల్లో ఎస్సీ ,ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంలోకి పలు సెక్షన్లను సైతం చేర్చాలన్నారు . అత్యాచార ఘటనల (Rape incidents)విచారణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం నియమించాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు లను పెంచాలన్నారు. పర్యావరణ పరిరక్షణ (Conservation of environment)కోసం పాలకులు చెరువులు ,కుంటలు పరిరక్షించడం పునరుద్ధరించడమే కాకుండా కాలుష్య కారక ఫార్మా కంపెనీల విస్తరణను ఆపాలన్నారు.

స్త్రీలపై అత్యాచారాలు హత్యాకాండ,కొన్ని ఘటనలు వ్యవస్థాగతమైన దుర్మార్గాలని, రుజువు అవుతుందన్నారు. అన్ని రంగాలలో స్త్రీ,పురుష సమాన హక్కుల కోసం పోరాడుతూనే స్త్రీలు ఆత్మరక్షణ (Women are self-defence) చేసుకుని హక్కు కోసం పోరాడాలి పిలుపునిచ్చారు.15 సంవత్సరాలుగా వివిధ అంశాలను లేవనెత్తి పోరాడుతున్న బహుజన బతుకమ్మ, ఈ దఫా స్త్రీలపై లైంగిక అత్యాచారాలకు నిరసనగా గుండెలు బాదుకోవమ్మ.. గుత్పలు అందుకోవమ్మా అంటూ పిలుపునిస్తున్నామన్నారు. భారత రాజ్యాంగం ప్రకారం గౌరవంగా బ్రతకడం కోసం పోరాడక తప్పదని తెలిపారు.ఈ కార్యక్రమంలో అరుణోదయ సాంస్కృతిక సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్సూర్,రాష్ట్ర నాయకులు ప్రభాకర్,రమేష్, రాకేష్, సుధాకర్, అనిత, పిఓ డబ్ల్యు రాజేశ్వరి, చెరుకు లక్ష్మి ,అన్నెబొయిన సుధాకర్, వేముల రామచంద్రయ్య, బొమ్మకంటి కొమురయ్య,పల్స యాదగిరి,వేముల గోపీనాథ్ రావుల లింగయ్య,పురుషోత్తం రెడ్డి, నిర్మల,బంటు రామ లింగయ్య ,లింగారెడ్డి,సూరయ్య, రంగు ముత్యంరాజు, బెల్లి నాగరాజు, జానీ , కట్లకుంట్ల రమేష్,తదితరులు పాల్గొన్నారు.