Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Bandaru Prasad : కమనీయంగా కనుమ పండుగ

Bandaru Prasad : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: పంటలు పండించడంలో సహాయ పడుతూ నిత్యం శ్రమించే పశువు లకు సంవత్సరానికి ఒకరోజు విశ్రాం తినిస్తూ ఆరాధించే వేడుకె కనుమ పండుగని బిజెపి రాష్ట్ర నాయకు లు బండారు ప్రసాద్ అన్నారు. వీటి కాలనీలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా మూడో రోజు అయిన కనుమ పండుగ సందర్భంగా గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టానికి తగిన ప్రతిఫలం కనుమ అని పాడిపంటలకు సమకూర్చిన పశుపక్షాదులకు ఇచ్చే గౌరవం కనుమ పండుగ అని మనలోని మంచితనాన్ని వెలిగించే రోజు, అందరం కలిసి కష్టాలను పంచుకునే పర్వదినమే కనుమ అని అన్నారు.

 

రైతులు ఆరుగాలం పండించి పంట ఇంటికి వచ్చేందుకు పశువుల శ్రమ ఎంతో ఉంటుందని వాటి శ్రమ తో పాటు వాటి మన మూత్ర విసర్జనకు కూడా మానవాళికి రైతులకు ఎంతో ఉపయోగ ఉంటుందని గోవులను పూజించాలని సనాతన ధర్మం సూచిస్తుందని మానవాహిక గోపూజ కొనసాగుతుందని అందుకు మనము గోమాతను నిత్యం పూజించాలని అన్నారు. ఈ సందర్భంగా గోమాత ప్రత్యేకతను వివరించారు. ఈ కార్యక్రమంలో అనూష రామాంజనేయులు రమణమ్మ ,ఎడుపాటి పద్మ, రాధిక ,బండారు కళ ,బండారు వర్ష, బోనాల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు