Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

District Collector Tripathi : మే 25 లోగా బ్యాంకులు సమ్మతి పత్రాలను ఇవ్వాలి

— జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

District Collector Tripathi : ప్రజాదీవెన, నల్గొండ: రాజీవ్ యువ వికాసం పథకం కింద గుర్తించిన, అర్హులైన లబ్ధిదారులకు మే 25 లోగా బ్యాంకులు సమ్మతి పత్రాలను ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. మంగళవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో రాజీవ్ యువ వికాసం పై సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సందర్భంగా, బ్యాంకర్లు రాజీవ్ యువ వికాస పథకం కింద గుర్తించిన లబ్ధిదారులకు సమ్మతి ఇవ్వడంలో జాప్యం చేయవద్దని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా అమలు చేస్తున్న పథకాలలో రాజీవ్ యువ వికాస పథకం ఒకటని, అందువల్ల మండల స్థాయి కమిటీలు గుర్తించిన, అర్హులైన వారికి మే 25 నాటికి సమ్మతి పత్రాలు ఇవ్వాలని చెప్పారు. అంతేకాక లబ్ధిదారులందరికీ బ్యాంకులలో జీరో అకౌంట్ ప్రారంభించాలని తెలిపారు. లబ్ధిదారులకు మంజూరు చేసే సబ్సిడీ మొత్తం ఈ జీరో అకౌంట్లలో జమ అవుతుందన్నారు. ఎల్ డి ఎం శ్రమిక్, ఇంచార్జ్ ఈడి ఎస్సి కార్పొరేషన్ మాన్య నాయక్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి చత్రు నాయక్, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.