Bashiruddin: ప్రజా దీవెన కోదాడ : కోదాడలో గత కొద్ది రోజులుగా మసీద్ కమిటీ అధ్యక్షులు షేక్ మొహమ్మద్ మరియు సరే మీర్ ఆలం ఇమామ్ అబ్దుల్ ఖాదిర్ సాహెబ్ రషాది లమధ్య జరుగుతున్న వివాదం కోదాడ ముస్లింల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయని కోదాడ సామాజిక ఉద్యమ కార్యకర్త సయ్యద్ బషీరుద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ ఇరువురు మధ్య వాట్సాప్ ఆడియో వీడియోలలో ఒక ప్రాపర్టీలు మదర్సా భూములు ట్రస్టుల విషయంలో 40 ,50 సంవత్సరాల విషయాల్ని రచ్చ కీడుస్తూ ఇరువురు ముస్లింల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారని తెలిపారు.
గతంలో లోకాయుక్త తీర్పు ఇచ్చినప్పటికీ అమలు చేయకపోవడం బాధాకరమని కోదాడ పట్టణంలో మజీద్ కాంప్లెక్స్ లో ఉన్న దుకాణాలను సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ వేలం పాటలు నిర్వహించి దుకాణాలను కేటాయించకపోవడం వలన జీవనోపాధి కోల్పోయిన పేదల,మధ్యతరగతి , దివ్యాంగులు నిరుద్యోగ యువతను మరిచి మాట్లాడుతున్నారని ఇప్పటికైనా ప్రభుత్వం వక్ బోర్డు జోక్యం చేసుకొని షాపుల వేలంపాటలు నిర్వహించి నిరుపేదలకు బ్రతుకుతెరువు చూపాలని తెలిపారు కోదాడలో మదర్శాల విషయాల్ని అసలు నిజాల్ని బయటపెట్టి ముస్లింల హక్కుల్ని పరిరక్షించాలని కోరారు ఇరువురు ముస్లిం పెద్దల మధ్య చెలరేగిన వివాదంపై అవసరమైతే ఏసీబీ దర్యాప్తును జరిపించాలని తెలిపారుమ