Beautician Suicide : ప్రజా దీవెన, హైదరాబాద్: భాగ్యన గరంలోని రాయదుర్గంలో బ్యూటీ షియన్ ఆత్మహత్య తీవ్ర సంచల నం సృష్టించిoది. ఫ్రెండ్స్ వద్దకు వెళ్తున్నట్లు చెప్పిన యువతి ఓయో హోటల్లో యువతి సూసైడ్ చేసు కు న్న ఘటన ఆలస్యంగా వెలుగులో కి రావడం, మృతురాలు అనూష (26)గా గుర్తించారు. హోటల్ సిబ్బంది సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమి త్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. నల్ల గండ్లలో నివాసం ఉంటున్న అనూ ష బ్యూటీషియన్గా పనిచేస్తున్నా రు. అనూషకు పెళ్లి జరిగినప్పటికీ భర్తతో విభేదాలు తలెత్తాయి.దీంతో భర్త నుంచి విడిపోయిన యువతి..
తల్లిదండ్రుల వద్దనే ఉంటోంది. వారి ని చూసుకుంటూ బ్యూటీషియన్గా విధులు నిర్వహిస్తోంది. ఈ క్రమం లో ఈనెల 22న సాయంత్రం ఆరు గంటల సమయంలో స్నేహితుల వద్దకు వెళ్తున్నట్లు యువతి తల్లి దండ్రులకు చెప్పి ఇంట్లో నుంచి వె ళ్లింది. అయితే రాత్రి గడిచినప్పటికీ అనూష ఇంటికి రాకపోవడంతో త ల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశా రు. ఆమెకు ఫోన్ చేసినప్పటికీ స్పం దించకపోవడంతో యువతి కోసం గాలించడం మొదలుపెట్టారు. బం ధువులను ఫోన్ చేసి అనూష గు రించి ఆరా తీశారు. అయితే ఎవ రూ రాలేదని చెప్పడంతో వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.అయితే రాయదుర్గంలోని క్యూబిన్ ఓయో లాడ్జ్లో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆ త్మహత్యకు పాల్పడింది అనూష. ఈ విషయాన్ని ఓయో లాడ్జ్ సిబ్బం ది పోలీసులకు సమాచారం అం దించగా వారు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకు న్నారు. అయితే అనూష ఎందుకు సూసైడ్ చేసుకుందనే విషయం తె లియాల్సి ఉంది. యువతి మృతి వి షయంపై తల్లిదండ్రులకు సమాచా రం అందించారు పోలీసులు. కానీ యువతి ఆత్మహత్యపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్య క్తం చేశారు. దీనిపై పోలీసులకు ఫి ర్యాదు చేశారు. దీంతో రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి వి చారణ ప్రారంభించారు. అసలు యువతి లాడ్జ్కు ఎందుకు వచ్చిం ది. యువతితో పాటు ఎవరైనా వ చ్చారా ఆత్మహత్యకు గల కారణా లు ఏంటి, యువతిది ఆత్మహత్యా లేక హత్యా అనే కోణంలో పోలీసు లు దర్యాప్తు చేపట్టారు. ఏది ఏమై నా స్నేహితులను కలుస్తానంటూ ఇంట్లో నుంచి వెళ్లిన తమ బిడ్డ ఇ లా విగతజీవిగా మారడంతో తల్లి దండ్రులు కన్నీరుమున్నీరుగా విల పిస్తున్నారు.