–ఎన్నికల ముందు పాదయాత్రలో ప్రజల గుండె చప్పుడు విన్నా
— ప్రజల ఆశీర్వాదంతోనే డిప్యూటీ సీఎంను అయ్యాను
–ఆదిలాబాద్ ను గుండెల్లో పెట్టు కొని చూసుకుంటా
–అతిత్వరలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రారంభిస్తాం
–నిరుద్యోగులకోసం జాబ్ క్యాలెం డర్ విడుదల చేశాం
–అదిలాబాద్ లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
Bhatti Vikramarka:ప్రజా దీవెన, ఆదిలాబాద్ : ప్రజా సమస్యల పరిష్కారం కోసమే తెలం గాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తు న్నామని చెప్పారు.ఆదిలాబాద్ జిల్లా పిప్పి రిలో రూ.20.50 కోట్లతో పలు అభివృద్ధి పనులకు భట్టి విక్రమార్క భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభ లో ఆయన మాట్లాడారు. ఎన్ని కలకు ముందు పాదయాత్రలో ప్రజ ల గుండె చప్పుడు విన్నా ముందు తాను ఆదిలాబాద్ జిల్లా పిప్రిలో ప్రారంభించిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చరిత్రాత్మకమని భట్టి విక్రమార్క అన్నారు. ఈ క్రమంలో పిప్రిలో పలు అభివృద్ధి కార్యక్ర మాలకు డిప్యూటీ సీఎం భట్టి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడి ప్రజ ల ఆశీర్వాదంతోనే తాను 32 రోజు ల పాటు పాదయాత్ర చేశానని, ప్రజ ల గుండె చప్పుడు విన్నానని అన్నా రు. రాష్ట్ర ప్రజల సమస్యలు తెలు సుకునేందుక గతంలో రాష్ట్రవ్యా ప్తంగా పాదయాత్ర చేశాను. గత ఏడాది మార్చి 16న పిప్పిరి నుంచే పీపుల్స్ మార్చ్ ప్రారంభించాను.
ఈ ఏడాది మార్చి 16న ఇక్కడే సభ పెట్టాలనుకున్నాం, కానీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. జరిగే సభకు చాలా ప్రత్యేకత ఉందని, ఇక్కడి ప్ర జల ఆశీర్వాదం వల్లే రాష్ట్రంలో కాం గ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. నియోజకవర్గంలో 3,500 ఇళ్లకు తగ్గకుండా ఏడాదిలో 4.50 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నాం. ఆరోగ్యశ్రీ (Arogyashri) కింద ఇచ్చే మొత్తాన్ని రూ.5లక్షల నుంచి రూ. 10లక్షలకు పెంచాం అని భట్టి విక్రమార్క అన్నారు. మీ ఆశీర్వా దంతోనే డిప్యూటీ సీఎంను అయ్యా నని భట్టి చెప్పారు. పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ గుర్తున్నాయని, వాటిని ఒక్కొక్క టిగా కచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు. అప్పుడు చెప్పినట్టుగానే ధరణిని బంగాళాఖాతంలో వేశామ ని తెలిపారు. ధరణిపై కేబినెట్ సబ్ కమిటీ వేశామని, దానిని సమూ లంగా ప్రక్షాళన చేస్తామని వివరిం చారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వెనుకబడిన ప్రాంతం కాదని అన్నా రు. ఈ జిల్లాను తాను గుండెల్లో పెట్టి చూసుకుంటానని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులున్నా ప్రతి రూపా యిని జాగ్రత్తగా ఖర్చు పెడుతు న్నామని, ఆరు గ్యారెంటీల్లో అతి ముఖ్యమైన రుణ మాపీని అమలు చేశామని అన్నారు. నిరుద్యోగులకు (For the unemployed) ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నా మని చెప్పారు. టీజీపీఎస్సీని ప్రక్షా ళన చేశామని, 8 నెలల్లో 30 వేల కొలువులు భర్తీ చేశామని, అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ ను కూడా విడుదల చేశామని వివరించారు. ఆడ బిడ్డలకిచ్చిన మాటకోసం మహిళా తల్లులకు మొదటి రోజునే ఫ్రీ బస్ స్కీం ను ప్రారంభించామని చెప్పారు. త్వరలోనే ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తామని భట్టి చెప్పా రు. ఇందు కోసం ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు ఇవ్వనున్నట్టు ఆయన వివరించారు. తుమ్మిడి హెట్టి ప్రాజెక్టు ను నిర్మించి తీరు తామని అన్నారు రూ.45 కోట్లు వెచ్చించి పిప్రి లిప్ట్ ఇరిగేషన్ స్కీం ను ప్రారంభిస్తామని వివరిం చా రు.కార్యక్రమంలో స్థానిక నేతలు పలువురు పాల్గొన్నారు.