Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Bhatti Vikramarka: రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం

–అర్హులందరికీ రుణమాఫీ చేస్తాం
–పవర్ సర్ ప్లస్ గా తీర్చిదిద్దుతాం
–రూ. 20 వేల కోట్ల వడ్డీ లేని రుణా లు
–ప్రతి నియోజకవర్గంలో నాలెడ్జ్ సెంటర్
–కెసిఆర్ ఏం ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వస్తావు
–ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

Bhatti Vikramarka: ప్రజా దీవెన, పెద్దపల్లి: రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం నడుస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమా ర్క
(Bhatti Vikramarka) పునరుద్ఘాటించారు. శనివారం పెద్దపల్లి జిల్లా రామగుండంలో ప లు అభివృద్ధి కార్యక్రమాలకు శం కుస్థాపన చేసిన అనంతరం నిర్వ హించిన బహిరంగ సభలో మాట్లా డారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో పదేళ్లపాటు దుర్మా ర్గపు ప్రభుత్వం రాజ్య మేలింద న్నారు. గత డిసెంబర్లో ప్రజాప్రభు త్వం అధికారంలోకి వచ్చిందని ఇందిరమ్మ రాజ్యం నిర్మించే దిశగా పనిచేస్తున్నామన్నారు. పాదయా త్ర సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా రామగుండంలో ఎనిమిది వేల కోట్ల రూపాయలతో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన కేంద్రాన్ని త్వరలో మంజూరు చేస్తా మన్నారు. 24 గంటల పాటు వి ద్యుత్ ఉత్పాదన జరిపి రాబోయే 10 ఏళ్లలో తెలంగాణను సర్ప్లస్ పవర్ రాష్ట్రంగా తీర్చిదిద్ది ఇతర రాష్ట్రాలకు విద్యుత్తును అమ్మే విధంగా తయారు చేస్తామన్నా రు.

ఎన్నికల హామీలు భాగంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తు న్నామని మహిళలకు మహాలక్ష్మి పథకంలో (In Mahalakshmi scheme) భాగంగా ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించి వారి టికెట్ల కోసం ఇప్పటికే ఆర్టీసీకి (rtc) 2500 కోట్ల రూపాయలు చెల్లించామన్నారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని, 200 యూనిట్ల ఉచిత కరెంటు అందిస్తున్నామన్నా రు. రాజీవ్ ఆరోగ్యశ్రీని 10 లక్షల రూపాయలకు పెంచామని, రాష్ట్రం లో నాలుగు లక్షల 50వేల డబుల్ బెడ్ రూమ్ గృహాలను ప్రభుత్వం మంజూరు చేసిందని ప్రతి నియో జకవర్గంలో 3500 డబుల్ బెడ్రూం లు నిర్మించి అర్హులైన నిరుపేదలకు అందిస్తామన్నారు.

గత టిఆర్ఎస్ ప్రభుత్వం (TRS Govt) పదేళ్లు పాలించిన లక్ష రూపాయల రుణమాఫీ రైతులకు చేయలేకపోయిందని, తమ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే రెండు లక్షల రుణమాఫీ (Loan waiver)చేసి చూపామన్నారు. ఇప్పటికే 18 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ కోసం ప్రభుత్వం రైతుల ఖాతాల్లో వేసిందన్నారు. సాంకేతిక కారణాల వల్ల ఎవరైనా రైతులకు రుణమాఫీ జరగకపోతే సంబంధిత వ్యవసా య అధికారులకు తెలియజేస్తే వెంటనే రుణమాఫీ చేస్తామన్నారు. ప్రతి ఏడాది మహిళలకు 20వేల కోట్ల రూపాయల వడ్డీ లేని రుణా లు, ఐదేళ్లలో లక్ష కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు అందిస్తామన్నా రు.గత ప్రభుత్వం రెసిడెన్షియల్ కళాశాలలకు (Government Residential Colleges) గత ఏడాది మూడు కోట్ల రూపాయలను మాత్రమే వెచ్చించిందని, తమ ప్రభుత్వం ఈ ఏడాది కోసం ఐదు వేల కోట్ల రూ పాయలు కేటాయించిందన్నారు. ఇచ్చిన ప్రతి హామీని తమ ప్రభు త్వం నెరవేరుస్తుంటే పదేళ్లపాటు ప్రజలను మోసగించిన మాజీ ము ఖ్యమంత్రి కేసీఆర్ తిరిగి ప్రజల్లోకి వస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఉచిత ప్రయాణం వద్దని ప్రజలకు చెబుతారా లేదా రెండు లక్షల రుణమాఫీ వద్దని చెబుతారా అని ప్రశ్నించారు. బహిరంగ సభలో మంత్రులు దుది ల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యేలు మక్కాన్సింగ్, వినోద్, వివేక్, ప్రేమ్ సాగర్ రావు, విజయ రమణారా వు, లక్ష్మణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.