Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Bhatti Vikramarka: బిఆర్ఎస్ నేతలు చేసిన అప్పుల బకాయిలు మేము తీరుస్తున్నాం

–వారి హయంలో రూ. 40 వేల కోట్ల బకాయిలకు ఇప్పటికే రూ. 14 వేల కోట్లు చెల్లించాము
–పదేళ్ళ పాలనలో చేసిన తప్పులు ఆరు నెలలకొసారి మతిపోయేలా ప్రజలు సమాధానం ఇస్తున్నారు
–30 సంవత్సరాలకు ఔటర్ రింగు రోడ్డును టిఆర్ఎస్ పాలకులు అమ్ముకున్నారు
–ఆస్తులు అప్పులపై క్వశ్చన్ అవర్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ప్రజా దీవెన, హైదరాబాద్: టిఆర్ఎ స్ నేతలు పది సంవత్సరా ల పాల నలో తప్పులు చేసినందుకే ఆరు నెలలకు ఒకసారి మతిపో యేలా ప్రజలు తీర్పు ఇస్తున్నారని డిప్యూ టీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అ న్నారు. సాదరణ ఎన్నికల్లో ఆ త ర్వాత ఆరు నెలలకు పెరిగిన పార్ల మెంటు ఎన్నికల్లో వారికి డిపాజిట్ రాకుండా చేశారని అన్నారు. టిఆ ర్ఎస్ నేతలది భూస్వామ్య మనస్త త్వం, నాపై వారు ప్రివిలేజ్ మోషన్ ఎందుకు ఇస్తారని ప్రశ్నించారు. ఖమ్మంలో మీడియా సమావేశంలో మాట్లాడుతున్న సందర్భంగా రైతు లకు 21 వేల కోట్లు రైతు రుణమా ఫీ చేశామని చెప్పగా భూమిలేని నిరుపేద కూలీలకు ఏమీ ఇవ్వరా అని ఓ జర్నలిస్టు ప్రశ్నించగా ఏడా దికి 12,000 ఇస్తామని ప్రకటించాను.

పేదలకు ఇవ్వడం తప్పా, వారి కి ఇవ్వొద్దని బిఆర్ఎస్ నేతలు కోరుకుంటున్నారా అని ప్రశ్నించా రు. టిఆర్ఎస్ నేతలు వారి కాలంలో వారికి అనుకూలంగా రూల్స్ బుక్ రూపొందించారు. ప్లకార్డులు తీసుకురావద్దని, నినాదాలు చేయొద్దని రాశారు. ఇప్పుడు వాటిని వారే ఉల్లంఘిస్తున్నారని తెలిపారు. వారి పాలనలో స్పీకర్గా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉన్నప్పుడు బీఏసీ సమావేశంలో ప్రతిపక్షాలు లేవనెత్తాలనుకున్న అంశాలు, అధికారపక్షం అనుకున్నా అంశాలు అన్నీ కలిపి స్పీకర్కు ఇచ్చి వారి నిర్ణయం తీసుకుంటారని చెప్పేవారు. అదే పద్ధతిని మేము కూడా పాటించాలని కోరుకుంటే పోచారం శ్రీనివాస్ రెడ్డి స్థానంలో గడ్డం ప్రసాద్ కుమార్ ఉన్నారు. ఇప్పుడు బీఏసీ సమావేశంలో ఆ పద్ధతిని పక్కన పడేసి బిఎసి సమావేశంలో కాగితాలు పారేసి వెళ్లిపోతున్నారు ఇదేం సాంప్రదాయమని ప్రశ్నించారు.

మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లక్ష కోట్లు అప్పు చేసిందని విపక్షాలు చేసే ప్రచారంలో వాస్తవం లేదు మేము 52 వేల కోట్లు మాత్రమే అప్పు చేసాం.. 66,000 కోట్లు వడ్డీ అసలు కలిపి ఈ 11 నెలల్లో బకాయిలు చెల్లించడం జరిగింది అన్నారు. టిఆర్ఎస్ నేతలు 40 వేల కోట్ల బిల్లులు పెండింగ్లో పెడితే మేము ఇప్పటికే 14 వేల కోట్లు వారు పెట్టిన బకాఈలు క్లియర్ చేశాం అన్నారు. వారి పాలనలో పౌరసరఫరాల శాఖలో 18 వేల కోట్ల రూపాయలు పెట్టిపోయారు, మిల్లర్స్ నుంచి బ్యాoక్ గ్యారెంటీ కూడా తీసుకోలేదని అన్నారు. మా మంత్రి ఉత్తమకుమార్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ బకాయి అన్నిటిని క్లియర్ చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారని తెలిపారు.

మేము రైతుల నుంచి ధాన్యాలు కొనుగోలు చేసిన మూడు రోజులకే బిల్లులు చెల్లిస్తున్నాం మీ జీవితంలో ఎప్పుడైనా ఇలా ఇచ్చారా? సన్నాలకు కింటాకు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాం.. ఈ నిర్ణయం ద్వారా ఎకరాకు 15,000 అదనంగా వచ్చిందని మా ఊరి రైతు చిట్టిబాబు సెల్ ఫోన్కు మెసేజ్ చేశారని వివరించారు.
రైతులకు ఉచిత విద్యుత్తు కాంగ్రెస్ పేటెంట్. 2004లో మా ప్రభుత్వం ప్రారంభించి ఎప్పటికప్పుడు డిస్కములకు బకాయిలు చెల్లించేది. కానీ టిఆర్ఎస్ నేతలు 18 వేల కోట్ల బకాయిలు డిస్కములకు పెట్టారని, మేము ఎప్పటికప్పుడు డిస్కములకు బకాయిలు చెల్లిస్తున్నాం ఇప్పటికే 11 వేల కోట్లు చెల్లించామని తెలిపారు. పరిశ్రమల శాఖలో వారు 3,000 కోట్ల బకాయిలు పెట్టి పోయారని అన్నారు.

టిఆర్ఎస్ పాలకులు కాంట్రాక్టర్లకు ప్రతి సంవత్సరం పెరిగిన ధరలకు అనుగుణంగా బిల్లులు చెల్లించేవారు.. కానీ పేద బిడ్డలు చదువుకునే వసతి గృహాల్లో మెస్ ఛార్జీలు మాత్రం ఒక్క రూపాయి పెంచలేదు.. ఫలితంగా పెరిగిన ధరలకు అనుగుణంగా కాంట్రాక్టర్లు ఆహారం అందించలేక నాణ్యతలేని భోజనం ఇవ్వడంతో పిల్లలు ఇప్పుడు అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఈ దుస్థితిని గమనించి మేము ఒకేసారి 40 శాతం మెస్ చార్జీలు, 200 శాతానికి పైగా కాస్మోటిక్స్ చార్జీలు పెంచామని తెలిపారు.

హరీష్ రావుకు ఎప్పటికీ నిజం చెప్పే అలవాటు లేదు ఆయనకు రాజకీయం చేసే అలవాటు ఉందని డిప్యూటీ సీఎం ఆరోపించారు. ఆర్బిఎం పరిధిని దాటి మేము ఎప్పుడూ అప్పు చేయలేదు వీలైతే తగ్గించుకుంటూ పోవాలని జాగ్రత్తగా తీసుకుంటున్నాం పది సంవత్సరాల్లో జరిగిన ఆర్థిక విధ్వంశాన్ని ఒక సంవత్సరంలో చక్కబెట్టలేం అందుకే కొంత అప్పు చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సృష్టించిన ఔటర్ రింగ్ రోడ్డు ను 30 సంవత్సరాల కాలానికి టిఆర్ఎస్ నేతలు అమ్ముకున్నారు… వాళ్లు లీజుకి ఇచ్చి సొమ్ము చేసుకున్నారని తెలిపారు. వారి తరహాలోనే మేము కూడా కమర్షియల్ ట్యాక్స్.. మరి కొన్ని వాటిని 30 సంవత్సరాలకు ఇప్పుడే అదానీ, అంబానీ కి ఇప్పుడే అమ్ముకుంటే వచ్చే ప్రభుత్వాలు ఎలా బ్రతుకుతాయని అన్నారు.