Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Bhu Bharati Act : భూ భారతి చట్టం రైతులకు చుట్టం

Bhu Bharati Act : ప్రజా దీవెన, సూర్యాపేట: సూర్యా పేట పట్టణంలోని సుమంగళి ఫం క్షన్ హాల్ లో సూర్యాపేట మండల భూ భారతి చట్టంపై అవగాహన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి గ వ్యవసాయ,రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్ గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూ భారతి చట్టం రైతుల చట్టం,భూ వివాదల శాశ్వత పరిష్కారానికి తెచ్చిందే భూ భారతి చట్టం అన్నారు.ప్రతి వ్యక్తికి ఆధార్ లాగా ప్రతి భూమికి భూదార్ ని చెప్పారు.భూమి రికార్డులను మోసపూరితంగా మార్చి ప్రభుత్వ,భూధాన్,అసైన్డ్,దేవాదాయ భూములను ఎవరైనా పట్టా చేసుకుంటే వాటిని రద్దు చేసేలా CCLA కి అధికారాలు ఉంటాయన్నారు.

కొత్త చట్టంలో అప్పీలు వ్యవస్థ తెచ్చమని,ఎవరి భూమి అయిన వేరే వాళ్ళకు తప్పుగా నమ్ముదైతే ఎమ్మార్వో,ఆర్డీవో,జేసీ,కలెక్టర్ కు అప్పీలు చేసుకొని పరిష్కరించుకోవచ్చాన్నారు.

ప్రతి గ్రామానికి గ్రామ పరిపాలన అధికారులను నియమించడంతో రైతులకు అన్ని సేవలు గ్రామంలోనే అందుతాయన్నారు. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసి రైతులకు,ప్రజలకు అన్ని సేవలు అందించేలా ఉపయోగపడుతుందన్నారు.