Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

bhubharathitelangana : భూభారతితో భూములపై సర్వహక్కులు

--నకిరేకల్ శాస నసభ్యులు వేముల వీరేశం

 

bhubharathitelangana:  ప్రజా దీవెన, కేతేపల్లి: భూ భార తి ద్వారా రైతులకు వారి భూములపై అన్ని రకాల హక్కులు కల్పిం చబడ తాయని నకిరేకల్ శాస నసభ్యు లు వేముల వీరేశం అన్నా రు. భూ భా రతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించేందుకు నిర్వ హిస్తున్న అవగాహన సదస్సులలో భా గంగా బుధవారం నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజక వర్గం కేతేపల్లి తహసిల్దార్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన భూభారతి అ వగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ధరణిలో ఉన్న సమస్యలను గుర్తించి ధరణి స్థానంలో రైతులకు మే లైన చట్టం తేవాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ధరణిని రద్దు చేసి రై తు సంఘాలు, రెవెన్యూ అధికా రు లు, మేధావులతో చర్చలు జరి పి ధరణి స్థానంలో భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందన్నా రు. భూ భార తి చట్టం ద్వారా రైతులకు సంబం ధించిన అన్ని భూ సమస్యల ను పరిష్కరించడమే కాకుండా, వారికి భూధార్ కార్డును ఇవ్వడం జరుగు తుందన్నారు.

ధరణిలో అధికారు లకు అధికా రాలను తొలగించడం వల్ల భూ స మస్యల పరిష్కారం నిమిత్తం రైతు లు, సివిల్ కోర్టుకు వెళ్లాల్సి వచ్చే ద ని, భూభారతిలో అలాంటి అవసరం లేదని తెలిపారు. కింది స్థా యి అధికారుల వద్ద పొరపాట్లు జరిగితే లేదా పని కాకపో యినా పై స్థాయి అధికారులు న్యాయం చేసే అవకాశం భూ భారతిలో ఉంద న్నా రు.అంతేకాక భూ భారతిలో ప్రతి సంవత్సరం రికార్డులను అప్డే ట్ చేయడమే కాకుండా, భద్రపరచడం జరుగుతుందన్నారు.

రైతులకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారుల పై ఉందని అన్నారు. అధికారులు చట్టాన్ని పకడ్బందీగా అమలు చే యాలని, అలాగే రైతులు సైతం భూ భారతి చట్టం అమలులో అధి కారులకు పూర్తి సహకారం అందిం చాలని కోరారు. భూముల సర్వేకు రాష్ట్ర ప్రభుత్వం లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించనుం దని, భూ భా రతి చట్టం దేశానికి ఆదర్శం కాను న్నదని తెలిపారు.

జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి మాట్లాడుతూ ధరణిలో లేని అనేక వెసు లుబాట్లు భూభారతి చట్టంలో ఉన్నాయన్నారు .చట్టంలో మోకపై ఉన్న రైతులకు హక్కు ఉండాలన్న దే భూ భారతి చట్టం ముఖ్య ఉద్దే శం అని తెలిపారు .భూ భారతి వ ల్ల కేతేపల్లి మండలంలో రైతులకు న్యాయం జరుగుతుందని తాను విశ్వసిస్తున్నట్లు తెలిపా రు. 99 శాతం కేసులు భూ భారతిలో తహసిల్దార్ వద్దనే పరిష్కారం అవుతాయని, ఇవి కూడా ఉచితంగానే పరిష్కా రం అవుతాయని, ఎవరు ఎలాంటి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు.

రికార్డులను సవరించే అవకాశం భూ భారతి లో ఉందని, మ్యుటే షన్లు 30 రోజుల్లో అవుతాయని, ఒకవేళ కాకపోతే ఆటోమేటిక్ గా 31 రోజు అవుతుందని తెలిపా రు.కింది స్థాయి నిర్ణయాన్ని పై స్థా యిలో అప్పీల్ అవకాశం భూ భారతిలో ఉందన్నారు. జాతీయ రహ దారి పై జరుగుతున్న ప్రమా దాలను నివారించేందుకు వెంటనే జాతీ య రహదారుల సంస్థ ప్రాజె క్టుకు లేఖ రాస్తామని తెలిపారు. అలా గే కొప్పోలు అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణం విషయమై క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, ఆర్ డి ఓ వై. అశోక్ రెడ్డి ,తహసిల్దార్ మధుసూదన్ రెడ్డి లు భూ భారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించారు.ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు వెంక టరెడ్డి తదితరులు మాట్లాడారు.

నకిరేకల్ మండలంలో…..దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు విశ్వా సం కల్పించే విధంగా, వారి భూములకు రక్షణ కవచంలా ఉండేలా భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చిందని నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం అన్నారు. భూ భారతి చ ట్టంపై నిర్వహిస్తున్న అవ గాహన సదస్సుల లో భాగంగా బుధవారం నల్గొండ జిల్లా నకరికల్ మండల కేంద్రంలో నిర్వహించిన భూ భారతి అవగాహన సదస్సు కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

గతంలో ఉన్న ధరణిలో అనేక లోపాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభు త్వం గుర్తించి ధరణిస్థా నంలో కొత్త చట్టాన్ని తీసుకువచ్చేందుకు మేధావులు ,రైతు సంఘాలు, అందరితో చర్చించి గత చట్టంలోని లోపాలను సవరిస్తూ కొత్త చట్టం భూ భారతి ని తీసుకొచ్చిందన్నా రు. ధరణి పార్ట్ బి లో సుమారు పది లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు.

కొత్త చట్టంలో భూముల రికార్డుల బాధ్య త, భద్రత రెవెన్యూ శాఖ తీసుకుం తుందన్నారు .అలాగే రైతుల భూ ముల హక్కులను పరి రక్షిస్తుందని తెలిపారు. ప్రతి మనిషికి ఆధార్ కార్డు ఉన్నట్లే భూమి ఉన్న ప్రతి రైతుకి భూ ధార్ కార్డును ప్రభుత్వ ఇవ్వనుందని, దీని ద్వారా ఏ సర్వే నెంబర్ లో ఎం త భూమి ఉందో రైతుకు తెలుస్తుం దన్నారు. ధరణి రాకముందు భూ ములన్నింటిని వీఆర్వో వ్యవస్థ ని ర్వహించేదని, ధరణి వచ్చిన తర్వా త వీఆర్వో వ్యవస్థను ప్రభుత్వం తీసివేసిందని, ఇప్పుడు ప్రభుత్వం తిరిగి దానిని పునరుద్ధరించనుం దన్నారు.

ధరణిలో అప్పీల్ వ్యవస్థ లేదని, భూ భారతిలో కిందిస్థాయిలో ఎ మ్మార్వో తప్పు చేస్తే సవరించే అవ కాశం ఆర్డిఓకు ఉందని తెలి పా రు. భూముల సర్వే కోసం లైసెన్స్ సర్వే యర్లకు శిక్షణ ఇచ్చి నియ మించనుందని, దీని ద్వారా రైతుల భూ ములకు హద్దులు కల్పించే అవకాశం ఉందన్నారు. గతంలో ఉన్న చ ట్టానికి, ఇప్పటి చట్టానికి పోలికనే లేదని, రైతులకు ఎంతో మేలు కలిగించే భూ భారతి చట్టం నిజంగా రైతుల పాలిట చుట్టమని తెలిపారు.

జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ తెలంగాణలో భూ భారతి చట్టం రావడం శుభసూచకమని అన్నారు. ఈ చట్టం ద్వారా రైతుల కు భూదార్ కార్డు ఇవ్వడం, రికార్డు ల నిర్వహణ, సవరణ వంటివి శా శ్వతంగా ఉండిపోతుందన్నారు. అలాగే ఈ చట్టంలో అప్పీల్ పద్ధ తి ఉందని, ఎక్కడైనా తప్పు జరిగితే సవరించే అవకాశం చట్టంలో ఉం దని, గతంలో లాగా సివిల్ కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదని అన్నా రు.రికార్డులను సవరణలు చేసే అధికా రం, ప్రతి సంవత్సరం రికార్డు లను భద్రపరిచే అవకాశం భూభారతిలో ఉందని తెలిపారు. మ్యుటే షన్ కో సం దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లో కాకపోతే ఆటో మేటిక్ గా మ్యుటేషన్ అవుతుందన్నారు.

అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, నల్గొండ ఆర్డీవో వై. అశోక్ రెడ్డి, ప్రాథ మిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు వెంకటేశ్వర రావు, తదితరులు మాట్లాడారు.స్థానిక తహసిల్దార్ జమీరుద్దీన్ సమావే శానికి అధ్యక్షత వహిస్తూ భూ. భారతి ఇచ్చటపై రైతులకు అవగాహ న కల్పించారు. మాజీ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, తదితరులు ఈ కార్యక్ర మంలో పాల్గొన్నారు. కాగా తెలం గాణ సాంస్కృతి కళాకారులు భూ భారతి చట్టంపై రైతులకు తమ పా టల ద్వారా అవగాహన కల్పించారు.