టన్నెల్ లో 3 మీటర్ల లోతు బురదలో మృతదేహాలు
Big breaking : ప్రజా దీవెన, నల్లగొండ: ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న ఎనిమిది మంది అందరూ అను కున్నట్లే అసువులు బాసారు. మానవత్వ దృక్పథంతో సొరం గంలో చిక్కుకున్న వారంతా ప్రాణాలతో బయటపడతారని అందరూ ఆశించినప్పటికీ పరోక్షంగా అందరూ అనుకున్నట్లు జరిగింది. కానీ ఈ ప్రమాదం చివర కు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ట న్నెల్ లో చిక్కుకున్న ఎనిమిది మం ది సజీవ సమాధి అయ్యారు. టన్నె ల్ లో 3 మీటర్ల లోతు బురదలో వీరి మృతదేహాలను గుర్తించారు.
అత్యాధునిక పరికరాలు, రాడార్ల సాయంతో మృతదేహాలను గుర్తిం చడం జరిగింది. మృతదేహాల గు ర్తింపులో ఐఐటీ మద్రాస్ నిపుణుల బృందం కీలక పాత్ర పోషించింది. మృతి చెందిన వారిలో ఇద్దరు ఇం జినీర్లు కాగా, మిగిలిన ఆరుగురు కార్మికులు. టన్నెల్ లో చిక్కుకున్న అందరూ మరణించారని నిర్ధారణ కావడంతో అక్కడ తీవ్ర విషాదం నెలకొంది. ఏడు రోజుల క్రితం గత శనివారం టన్నెల్ లో ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే.