Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Big breaking : బిగ్ బ్రేకింగ్, పాఠశాల భవనం పై నుండి దూకి పదవతరగతి విద్యార్థి ఆత్మహత్య

–షాద్ నగర్ ప్రైవేట్ పాఠశాలలు ఘోరం

–ప్రిన్సిపాల్ తిట్టాడని మనస్థాపన చెందిన విద్యార్థి నీరజ్

Big breaking : ప్రజా దీవెన, హైదరాబాద్: రంగా రెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని ప్రైవేట్ శాస్త్ర స్కూల్ భవనం పై నుండి అదే పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న నీరజ్ అనే విద్యార్థి దూకి ఆత్మహత్య చేసు కున్నాడు. పాఠశాలలో పదో తరగ తి చదువుతున్న నీరజ్ మల్లికా ర్జున కాలనీకి చెందిన మరో విద్యా ర్థి బాల్కనీలో సాయంత్రం సమ యంలో ఏదో మాట్లాడుతుండగా ప్రిన్సిపల్ ఇరువురిని తన గదిలోకి పిలిచి తీవ్రంగా మందలించినట్లు కుటుంబ సభ్యులు బాధితులు చెబుతున్నారు. దీంతో మన స్థాపా నికి గురైన నీరజ్ టాయిలెట్ కోసం వెళ్తున్నట్లు చెప్పి అక్కడే భవనం పైకి ఎక్కి మొదటి అంతస్తు నుండి దూకాడు.

 

భవనం పై నుండి కింద పడిన అపస్మారక స్థితికి చేరుకు న్నాడు అయితే విద్యార్థిని మెరు గైన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా నీరజ్ అప్పటికే చనిపోయాడు. ప్రస్తుతం శాస్త్ర పాఠశాల వద్దకు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందే బాబ య్య, కుటుంబ సభ్యులు, అదేవి ధంగా బిజెపి యువ నాయకులు వంశీచంద్ తదితరులు చేరుకొని ఘటనపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందే బాబయ్య మీడి యాతో మాట్లాడారు. ప్రిన్సిపల్ నిర్వాకం వల్లే విద్యార్థి ఆత్మహ త్యకు పాల్పడ్డాడని అందె బాబ య్య ఆవేదన వ్యక్తం చేశారు. మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.