India Pakistan Ceasefire :ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం చల్లబడింది. రోజురో జుకు ఉదృతంగా మారుతున్న పరిణామాల నేపథ్యంలో ఇరుదేశా లు కాల్పుల విరమణ నిర్ణయానికి వచ్చినట్లు అధికారికంగా వెల్లడిం చాయి. ఈ మేరకు భారత్ పాక్ మ ధ్య కాల్పుల విరమణ ఒప్పం దం కుదరిందని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వెల్లడించా రు.
ఈ కాల్పులు విరమణ ఒప్పందం నేటి సాయంత్రం అయిదు గంటల నుంచి అమలులోకి వచ్చిందని తె లిపారు. నేటి మధ్యాహ్నం 3.35 కి పాకిస్థాన్ మిలటరీ ఆపరేషన్ డైరెక్ట ర్ జనరల్ మన మిలటరీ ఆపరేష న్ డైరెక్టర్ కు ఫోన్ చేసి కాల్పుల వి రమణ ప్రతిపాదన చేశారని తెలి పారు. దీనిపై ఉన్నతస్థాయి అధికా ర యంత్రాంగంతో చర్చలు జరిపిన అనంతరం విరమణకు భారత్ కూ డా అంగీకరించిందన్నారు. అంతే కాకుండా భారత్, పాక్ కు చెందిన మిలటరీ జనరల్స్ మధ్య ఈ నెల 12 వ తేదిన చర్చలు జరగనున్నా యని కూడా మిస్రీ ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో చెప్పారు. ఈ సాయంత్రం నుంచి భూ, గగన, సముద్ర తలాల నుంచి ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిందని స్పష్టం చేశారు.
డోనాల్డ్ ట్రంప్ హర్షం… అమెరి కా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచ లన ప్రకటన చేశారు. భారత్ , పాకి స్థాన్ ల మధ్య కాల్పులు విరమణ ఒప్పందం కుదిరిందని అయన తెలి పారు. ఈ మేరకు తన అధికార ఎక్స్ ఖాతాలో ట్విట్ చేశారు. ఇరు దేశాల అధినేతలతో గత రాత్రి అం తా చర్చలు జరిపామని, ఈ చర్చ లు ఫలప్రదమయ్యాయని ఆయన పేర్కొన్నారు.ఇరు దేశాలు విజ్ఞతతో వ్యవహరించి కాల్పుల విరమణకు అంగీకరించడం శుభపరిణామ మ ని వ్యాఖ్యానించారు. ఈ కాల్పుల విరమణ ఈ క్షణం నుంచే అమలు లోకి వస్తుందన్నారు. శాంతి కోసం ఒప్పందం కుదుర్చుకున్న ఇరు దేశా ల అధినేతలకు ట్రంప్ ఈ సందర్భం గా అభినందనలు తెలిపారు.