Big Breaking : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తోడ్కల్ తీస్తా అంటూ అసెంబ్లీ సాక్షిగా హెచ్చరిక చేసిన విషయం తెలిసింది. అయితే ఆయ న ఆ ప్రకటన చేసిన మరుసటి రోజే ఆ కోవకు చెందిన కొందరు యూ ట్యూబర్లపై అనివార్యంగానే పోలీ సు కేసులు నమోదయ్యాయి. మొ త్తం 11మంది యూట్యూబర్లపై సి టీ పోలీస్ కేసుల నమోదు చేశా రు.
బెట్టింగ్ యాప్ లకు ప్రమోషన్ చేస్తున్న యూట్యూబర్లపై పంజా గుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్టు అయిన వారిలో హర్ష సాయి, విష్ణు ప్రియ ,సుప్రీత, ఇమ్రాన్ ఖాన్, రీతు చౌదరి,టేస్టీ తేజ లు ఉన్నారు. అదే విధంగా అజయ్ కిరణ్ గౌడ్, అజయ్ సన్నీ యాదవ్ , సుదీర్ రాజు బయ్యా లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బెట్టింగ్ యాప్ లోకి ప్రమోషన్ చేస్తున్న యూట్యూబర్లు తమ వ్యూస్ పెంచుకోవడం కోసం బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్ చేస్తు న్నారు యూట్యూబర్లు. బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్ చేసి డబ్బులు తీసుకుంటున్న వారిపై కేసులు నమోదు చేసి విచారణ జరు పుతున్నారు.