Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Constable Killed : బిగ్ బ్రేకింగ్, దొంగతనం కేసు నిoది తుడి దుశ్చర్య, కత్తితో దాడి చేయ డంతో కానిస్టేబుల్‌ మృత్యువాత

Constable Killed : ప్రజా దీవెన, నిజామాబాద్: నిజా మాబాద్ జిల్లాలో ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనం చోరీ కేసులో నిందితుడిని ఠాణాకు తీసుకొస్తుండగా అకస్మాత్తుగా అత డు కత్తితో దాడి చేయడంతో ఓ కా నిస్టేబుల్‌ మృతిచెందిన సంఘటన నిజామాబాద్‌ నగరంలో జరిగింది.

పోలీసులు, స్థానికులు తెలిపిన వి వరాల ప్రకారం ద్విచక్రవాహనం దొం గిలించిన నిజామాబాద్‌లోని హాస్మీ కాలనీకి చెందిన రియాజ్‌ను పట్టు కునేందుకు సీసీఎస్‌ కానిస్టేబుల్‌ ప్ర మోద్‌, అతని మేనల్లుడిని సాయం గా తీసుకుని శుక్రవారం రాత్రి ఆ కా లనీకి వెళ్లారు. రియాజ్‌ను అదుపు లోకి తీసుకుని బైక్‌పై ఎక్కించుకు న్నారు. కానిస్టేబుల్‌ వాహనాన్ని న డుపుతుండగా అతని మేనల్లుడు వెనుక, నిందితుడు మధ్యలో కూ ర్చున్నారు.

ఈ క్రమంలో సీసీఎస్‌ ఠాణాకు వ స్తుండగా మధ్యలో వినాయక్‌నగర్‌ వద్ద నిందితుడు కత్తితో కానిస్టేబుల్‌ ఛాతీలో పొడిచాడు. ఆపేందుకు ప్ర యత్నించిన ప్రమోద్‌ మేనల్లుడిపై నా దాడి చేశాడు. ఈలోగా మరో ఇ ద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి రియాజ్‌ను తీసుకెళ్లబోయా రు. అప్పుడే అక్కడికి వచ్చిన సీసీ ఎస్‌ ఎస్‌ఐ విఠల్‌ వారిని అడ్డుకోగా ఆయనపైనా కత్తితో దాడి చేసి పరా రయ్యారు.

స్వల్ప గాయాలైన ఎస్‌ఐ విషయా న్ని సీఐ శ్రీనివాస్‌రాజ్‌కు తెలిపారు. సీఐ, నాలుగో ఠాణా ఎస్‌ఐ శ్రీకాం త్‌లు వచ్చి ప్రమోద్‌ను జీజీహెచ్‌కు తరలించారు. కానీ అప్పటికే అత డు మృతిచెందినట్లు వైద్యులు ని ర్ధారించారు. ప్రమోద్‌ మేనల్లుడి పరి స్థితి నిలకడగా ఉంది. నిందితుడు , అతనిని సహకరించిన మిగిలిన వా రి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కానిస్టేబుల్ ప్రమోద్‌కు భార్య, ము గ్గురు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.