Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Bitcoin Fraud: బిట్‌కాయిన్‌ పేరుతో బిగ్ మోసం.

–డాలర్లు పోగేయొచ్చని అమాయ కులకు వల
–ఏజెంట్లుగా ఎక్సైజ్‌ ఎస్సై, సివిల్‌ కానిస్టేబుల్‌
–వందల మందిని చేర్పించిన ప్రభుత్వ ఉపాధ్యాయులు
–కోట్లలో పెట్టుబడులు పెట్టిన అమాయకులు
–నిర్మల్‌ జిల్లాలో భారీ దందాలో నిందితుల అరెస్ట్‌

Bitcoin Fraud: ప్రజా దీవెన, నిర్మల్: ప్రపంచంలో చట్టబద్ధత లేని యూబిట్‌ కాయిన్‌ చైన్‌ వ్యాపారం (YouBit Coin Chain Business) అక్రమాలు వెలు గులోకి వచ్చింది. ఇందులో నిర్మల్‌ జిల్లాకు చెందిన కొంతమంది ప్రభు త్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు సూత్రధారులుగా వ్యవహరిస్తూ అమాయకులను బలి చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం అందిన ఫి ర్యాదుల మేరకు నిర్మల్‌ జిల్లా ఎస్పీ జానకీ షర్మిల ప్రత్యేక చొరవ తీసు కొని ఈ యూబిట్‌ కాయిన్‌ చైన్‌దం దా (YouBit Coin Chain Business)గుట్టును రట్టు చేయడమే కాకుండా పలువురు ఏజెంట్లను అరెస్టు చేశారు. ఓఎక్సైజ్‌ ఎస్సైతో పాటు రిటైర్డ్‌ ఆర్మీ ఉద్యోగి, కానిస్టే బుల్‌ మరో ఇద్దరు టీచర్లు వందల మందిని ఈ దందాలో రూ.లక్షల పెట్టుబడులు పెట్టించారని విచా రణలో తేలింది. గొలుసుకట్టు పద్ధ తిలో ఈ దందాను కొనసాగిస్తు న్నారు. మొదట రూ. 50వేల పెట్టు బడి పెట్టిన వారికి డాలర్లరూపంలో కాయిన్‌లు వస్తాయి.ఈ పెట్టుబడికి ప్రతీ నెల వడ్డీ రూపంలో వీరి ప్రత్యే క ఖాతాలో జమ అవుతున్నట్లు చూపుతున్నారు. దీంతో పాటు సభ్యులు మరో ఐదుగురిని చేర్పిస్తే వారికి మరింత ఆదాయం వస్తున్న ట్లు పేర్కొంటున్నారు.

ఇలా పెద్ద సం ఖ్యలో సభ్యులను చేర్పించిన వారి కి యూబిట్‌ కాయిన్‌ సంస్థ స్టార్‌ రేటింగ్‌లు (Star rating ప్రకటిస్తుండటం విశేషం. ఫైవ్‌ స్టార్‌ పొందిన వారు ఈ దం దాలో సీనియర్లుగా చెలామణి అవుతూ జిల్లా అంతటా సభ్యు లను చేర్పించారు. జగిత్యాల, కోరు ట్ల, మెట్‌పల్లి, ఆర్మూర్‌, కామారెడ్డి (Metpalli, Armor, Kamareddy)లాంటి పట్టణాల్లో కూడా వీరు నెట్‌ వర్క్‌ను విస్తరించినట్లు చెబుతు న్నారు. అయితే ఈ చైన్‌ దందాలో చివరకు ఎవరు చెల్లింపులు చేస్తా రనే విషయంపై స్పష్టత లేకున్నా అమాయకులు రూ.లక్షలు పెట్టు బడి పెడుతున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నిర్మల్‌ జిల్లా లోని కడెం మండలానికి చెందిన టీచర్లు, ఓ కానిస్టేబుల్‌తో పాటు నిర్మల్‌కు చెందిన ఓ ఎక్సైజ్‌ ఎస్‌ఐ ఈ దందాకు సూత్రధారులు గా ఉన్నట్లు తేలింది. ఫిర్యాదులు రావడంతో జిల్లా ఎస్పీ జానకీ షర్మి ల సూత్రధారుల సెల్‌ఫోన్లు, ఆర్థిక కార్యకలాపాలపై నిఘా పెట్టారు. దీంతో గుట్టు రట్టయ్యింది. వీరితో పాటు మరో 40మంది టీచర్లు కూ డా వందల మందిని సభ్యులుగా చేర్పించి వారిచేత రూ.కోట్లలో పెట్టు బడులు పెట్టించారని తెలు స్తోంది. అయితే ఈ పెట్టుబడులన్నీ తిరిగి రావడం కష్టమేనని నిపుణు లు పేర్కొంటున్నారు.

స్టేట్‌ సైబర్‌ క్రైం ఆరా..
నిర్మల్‌లో పెద్ద ఎత్తున కొనసా గుతున్న యూబిట్‌ కాయిన్‌ దం దాపై రాష్ట్ర సైబర్‌ క్రైం పోలీసులు (Cyber ​​crime police నిఘా పెట్టినట్లు సమాచారం. నిర్మ ల్‌ ఎస్పీ పంపిన నివేదిక ఆధారంగా సైబర్‌ క్రైం ఉన్నతాధికారులు కొద్ది రోజుల్లోనే రంగంలోకి దిగి ఈ దం దాపై ఆరా తీయనున్నట్లు సమా చారం.