Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

బిజెపి ప్రచార రథాల ప్రారంభం

నల్లగొండ బిజెపి జిల్లా కార్యాలయం లో ఎన్నికల ప్రచారం కోసం ప్రచార రథాలని నల్లగొండ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శానంపుడి సైదిరెడ్డి ప్రారంభించారు

ప్రారంభించిన బిజెపి ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి

 

ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్లగొండ బిజెపి జిల్లా కార్యాలయం లో ఎన్నికల ప్రచారం కోసం ప్రచార రథాలని నల్లగొండ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శానంపుడి సైదిరెడ్డి ప్రారంభించారు. జిల్లా అధ్యక్షులు డా. నాగం వర్శిత్ రెడ్డి బిజెపి జిల్లా కార్యాలయం వద్ద ప్రచార రథాలకు పూజా కార్యక్రమం నిర్వహించి భారతీయ జనతా పార్టీ జెండాను ఊపి ఎన్నికల ప్రచార రథాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు బిజెపికి పట్టం కట్టి కుటుంబ రాజకీయాలను బొంద పెట్టాలని పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ గెలిచిన వెంటనే యువతకు 50 వేల ఉద్యోగవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. 400 సీట్ల మెజా రిటీతో అధికారంలోకి రాబోతు న్నామని, దేశం సురక్షితంగా ఉండాలంటే నరేంద్ర మోడీ పాలనతోనే సాధ్యమని గుర్తు చేశారు.

 

ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కన్వీనర్ బండారు ప్రసాద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీదేవి రెడ్డి, పిల్లి రామరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతేపాక లింగస్వామి, రాష్ట్ర నాయకులు పోతేపాక సాంబయ్య, జిల్లా కోశాధికారి ఫకీరు మోహన్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ గాయం భూపాల్ రెడ్డి, దాసోజు యాదగిరచారి, గడ్డం మహేష్, నీరజ, జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి కనకయ్య , యువమోర్చా ప్రధాన కార్యదర్శి కిరణ్, కార్యదర్శి శాంతి స్వరూప్, కనగల్ మండల అధ్యక్షుడు పులకర బిక్షం, తిప్పర్తి మండల అధ్యక్షుడు పల్లె ప్రకాష్, నల్గొండ మండల అధ్యక్షుడు బోగరి అనిల్ కుమార్, అనుముల దేవి, సుధాకర్ రెడ్డి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.